News March 19, 2025

దేశంలోనే అత్యంత ధనిక MLA ఇతనే

image

దేశంలోని 4,092 MLAల ఆస్తులపై ఏడీఆర్ ఓ నివేదిక విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ముంబైలోని ఘాట్కోపర్ ఈస్ట్ శాసనసభ్యుడు పరాగ్ షా(BJP) దేశంలోనే ధనిక ఎమ్మెల్యేగా నిలిచారు. రూ.3,400 కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. రూ.1,413 కోట్లతో కర్ణాటక Dy.CM DK శివకుమార్(INC) రెండో స్థానంలో నిలిచారు. రూ.1,700తో దేశంలోనే అత్యంత పేద ఎమ్మెల్యేగా పశ్చిమ బెంగాల్‌లోని ఇండస్ శాసనసభ్యుడు నిర్మల్ కుమార్ ధారా(BJP) నిలిచారు.

Similar News

News November 7, 2025

NEEPCOలో 98 పోస్టులకు అప్లై చేశారా?

image

NTPC అనుబంధ సంస్థ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>NEEPCO<<>>)లో 98 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ , బీటెక్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://neepco.co.in/

News November 7, 2025

వారికి టోల్ ఫీజు వద్దు.. కేంద్రానికి లేఖ

image

AP: స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, MROలు, RDOలకు నేషనల్ హైవేలపై టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు లేఖ రాసింది. అధికారిక కార్యక్రమాల కోసం ప్రయాణించే అధికారుల ID చూపిస్తే టోల్ లేకుండానే పంపించాలని విజ్ఞప్తి చేసింది. ప్రకృతి విపత్తులు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల కోసం వీరు ఎక్కువగా NHలపై ప్రయాణిస్తుంటారని పేర్కొంది.

News November 7, 2025

‘ఎత్తు’లోనూ దూసుకుపోతున్న చైనా!

image

టెక్నాలజీతో పాటు చైనీయులు తమ ఎత్తును పెంచుకోవడంలోనూ దూసుకెళ్తున్నారు. గత 35 ఏళ్లలో చైనా పురుషులు సగటున 9 సెం.మీలు పెరగగా, భారతీయులు 2 సెం.మీ. మాత్రమే పెరగడం ఆందోళనకరం. పోషకాహార లోపం, నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వంటి కారణాలతో దాదాపు 35% మంది భారతీయ చిన్నారులు కురచబడినవారుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎత్తు పెరుగుదల అనేది సామాజిక-ఆర్థిక పురోగతికి సూచికగా పనిచేస్తుందని తెలియజేశారు.