News March 19, 2025
అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేయండి: సుప్రీం

దేశంలోని చాలా రాష్ట్రాల్లో రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేదలు అనుభవించాల్సిన ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. వెంటనే అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయాలని జస్టిస్ సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దేశంలో దాదాపు 80 శాతం మంది నిరుపేదలు ఉన్నారని, వారందరికీ ఆహార భద్రత ఎంతో అవసరమని పేర్కొంది.
Similar News
News March 20, 2025
HCA మాజీ కోశాధికారి ఆస్తి సీజ్

TG: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనుల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తులో ఈడీ పట్టు బిగించింది. HCA మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్ చేసిన అవినీతిపై ఆధారాలతో ED రూ.90.86 లక్షల అక్రమ సొమ్మును సీజ్ చేసింది. అజహరుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన పనుల్లో క్విడ్ ప్రోకో కింద అపెక్స్ సభ్యులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. సురేందర్ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు విచారణలో తేలింది.
News March 20, 2025
ఆర్ఆర్బీ లోకో పైలట్ పరీక్ష వాయిదా

RRB అసిస్టెంట్ లోకో పైలట్ సీబీటీ-2 పరీక్షను రైల్వే శాఖ వాయిదా వేసింది. నిన్న షిఫ్ట్ 1, 2లో జరగాల్సిన పరీక్షల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఏ సెంటర్లనోనైతే ఎగ్జామ్ జరగలేదో వారికి త్వరలోనే పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. అప్డేట్స్ కోసం తరచూ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది. కాగా 18,799 పోస్టులకు గతేడాది సీబీటీ-1 నిర్వహించి, ఫలితాలు వెల్లడించారు.
News March 20, 2025
ఆ ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు

దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC)లో పని చేసే ఉద్యోగుల వేతనాలు వచ్చే ఏడాదిలో 9.8% మేర పెరగనున్నట్లు ఓ నివేదిక అంచనా వేసింది. ఉద్యోగుల వేతనాల వృద్ధిలో GCCలు IT కంపెనీలను మించిపోయాయంది. 2030 నాటికి వీటి మార్కెట్ విలువ 11,000కోట్ల డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. దీంతో నైపుణ్యాలున్న ఉద్యోగులకు వేతనాలు గణనీయంగా పెరుగుతాయంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై GCCలు అధిక జీతాలు చెల్లిస్తున్నాయి.