News March 19, 2025
ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయించండి: మంత్రి నాదెండ్ల

AP: దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. అన్నదాతలకు అందుబాటులో 5 లక్షల గన్నీ సంచులున్నాయని తెలిపారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Similar News
News March 20, 2025
ఆ ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు

దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(GCC)లో పని చేసే ఉద్యోగుల వేతనాలు వచ్చే ఏడాదిలో 9.8% మేర పెరగనున్నట్లు ఓ నివేదిక అంచనా వేసింది. ఉద్యోగుల వేతనాల వృద్ధిలో GCCలు IT కంపెనీలను మించిపోయాయంది. 2030 నాటికి వీటి మార్కెట్ విలువ 11,000కోట్ల డాలర్లకు చేరవచ్చని పేర్కొంది. దీంతో నైపుణ్యాలున్న ఉద్యోగులకు వేతనాలు గణనీయంగా పెరుగుతాయంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబై GCCలు అధిక జీతాలు చెల్లిస్తున్నాయి.
News March 20, 2025
జనాభా కంటే ఫోన్లే ఎక్కువ

తెలంగాణ జనాభా కంటే ఫోన్ల సంఖ్యే ఎక్కువగా ఉందని బడ్జెట్ ద్వారా వెల్లడైంది. రాష్ట్రంలో 4.42 కోట్ల మొబైల్స్, 15.2 లక్షల ల్యాండ్ లైన్ ఫోన్లు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 1.71 కోట్ల వాహనాలు ఉన్నాయి. ఇందులో టూ వీలర్ల వాటా 73.52%. మిగతా కేటగిరీలో కార్లు, ఆటోలు, బస్సులు, మధ్య స్థాయి, భారీ రవాణా వాహనాలున్నాయి.
News March 20, 2025
2 రోజులు సెలవులు, 2 రోజులు ఆప్షనల్ హాలిడేస్

TG: హజ్రత్ అలి షహాదత్ను గుర్తు చేసుకుంటూ ఈ నెల 21న ఆప్షనల్ హాలిడే ఇచ్చిన ప్రభుత్వం అందులో మార్పు చేసింది. రంజాన్ నెల చంద్రవంక కనిపించడం ఆలస్యం కావడంతో మార్చి 22న ఐచ్ఛిక సెలవు ప్రకటించింది. ఈ నెల 28న కూడా జుమతుల్ విదా సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఉంది. దీంతో స్కూళ్లు, కాలేజీలు ముఖ్యంగా మైనారిటీ సంస్థలు సెలవు ఇవ్వొచ్చు. ఇక తెలంగాణ క్యాలెండర్ ప్రకారం మార్చి 31, ఏప్రిల్ 1న రంజాన్ సెలవులు ఉన్నాయి.