News March 19, 2025
10th విద్యార్థులకు ఇబ్బందులు కలగొద్దు: కలెక్టర్

అనంతపురంలోని రాంనగర్ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూలులో పదో తరగతి పరీక్షలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 20, 2025
అనంతపురం: 100% ఇంటింటి చెత్త సేకరణ.!

క్షేత్రస్థాయిలో 100% ఇంటింటి చెత్త సేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి SWPC షెడ్లు, GSWS అంశాలపై DPO, MPDO, మున్సిపల్ కమిషనర్లు, DLDO అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 56చోట్ల SWPC షెడ్లు పనిచేయడం లేదని.. వాటి బాధ్యత అధికారులపై ఉందన్నారు.
News March 19, 2025
టాటా ఇన్నోవేషన్ సెంటర్కు భూ సేకరణ: అనంత కలెక్టర్

రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ కార్యాలయం వద్ద ఉన్న భూమి, సెంట్రల్ యూనివర్సిటీ అడ్మిన్ బిల్డింగ్ను ఆయన పరిశీలించారు. 24గంటల్లో స్థల పరిశీలన చేయాలని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి, సర్వే AD, MROలను కలెక్టర్ ఆదేశించారు.
News March 19, 2025
హిందూపురం వ్యక్తి దారుణ హత్య

శ్రీ సత్యసాయి జిల్లా మలుగూరు సమీపంలో హిందూపురానికి చెందిన సద్దాం(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగగా.. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హిందూపురం రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.