News March 19, 2025
BHPL: పాఠశాలలకు హాల్టికెట్లు: డీఈవో

ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఐడీవోసీ కార్యాలయం నుంచి డీఈవో రాజేందర్ చీఫ్ సూపరింటెండ్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. హాల్టికెట్లను ఆయా పాఠశాలలకు పంపామని, ఎవరైనా హాల్ టికెట్స్ అందని విద్యార్థులు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఏమైనా సమస్యలు అంటే 040 23230942 నంబరుకు ఫోన్ చేయవచ్చని వెల్లడించారు.
Similar News
News September 15, 2025
భారత రత్నం మోక్షగుండం

దేశం గర్వించే ఇంజినీర్లలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ముందు వరుసలో ఉంటారు. 1908లో HYDలో మూసీ పొంగి 15వేల మంది మరణిస్తే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి వరద నివారణకు కృషి చేశారు. అంతేకాకుండా ప్రపంచంలోనే తొలిసారి జలాశయాలకు ఆటోమేటిక్గా వరద గేట్లు తెరిచే విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికీ ఈ విధానమే అమలులో ఉంది. ఆయన సేవలకు భారత రత్నతో సత్కరించిన కేంద్రం ఆయన జయంతిని ఇంజినీర్స్ డేగా నిర్వహిస్తోంది.
News September 15, 2025
భద్రాద్రి జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు

భద్రాద్రి జిల్లాకు చేరిన చీరలను అశ్వారావుపేట, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలంలో ఆరు గోదాంలలో భద్రపరుస్తున్నామని డీఆర్డీవో విద్యాచందన తెలిపారు. ఇప్పటి వరకు 40శాతం జిల్లాకు చేరాయి. బతుకమ్మ నాటికి ఇండెంట్ పెట్టినవన్నీ వస్తే ఒక్కొక్కరికి రెండు చీరలు అందిస్తాము. లేకుంటే ఒక్కోటి పంపిణీ చేసి, తర్వాత మళ్లీ అందిస్తామన్నారు.
News September 15, 2025
VJA: వాట్సాప్లో కనకదుర్గమ్మ ఆర్జిత సేవల టికెట్లు

విజయవాడలో ఈ నెల 22 నుంచి OCT 2 వరకు జరగనున్న శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల టికెట్లను EO శీనానాయక్ ఆన్లైన్లో విడుదల చేశారు. https://kanakadurgamma.org/en-in/home, ప్రభుత్వ వాట్సప్ సేవల నంబర్ 9552300009లో ఈ టికెట్లు కొనుగోలు చేయవచ్చన్నారు. ఉత్సవాలకు హాజరుకాలేని వారు ఆన్లైన్లో ఆర్జితసేవలు చేయించుకునేందుకు రూ.1,500 చెల్లించి వీడియో లింక్ ద్వారా పూజలను వీక్షించవచ్చన్నారు.