News March 19, 2025
మెట్ట పంటలపై రైతులు దృష్టి సారించాలి: కలెక్టర్

ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలాలు తగ్గడం ద్వారా వరి వేసిన రైతులు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. చిట్యాల మండలంలో కొంతం సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రం సందర్శించి రైతు సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే వాన కాలంలో వరి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వినియోగించుకుని మెట్ట పంటలు, పండ్లు కూరగాయలు సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు.
Similar News
News March 20, 2025
NLG: పిచ్చుకల దినోత్సవం సరే.. సంరక్షణ ఏది..?

పల్లెల్లో పిచ్చుకలను కుటుంబ సభ్యులుగా భావిస్తారు. రైతులు వాటిని ఆకలి తీర్చడానికి వరి, సజ్జ, జొన్న, కంకులను ఇళ్లలో వేలాడదీసేవారు. అవి ఇంట్లోనే గూళ్లను ఏర్పరచుకుని వాటిని తింటూ కిచకిచలాడుతూ ఉండేవి. కాలక్రమేణా కాలుష్యం, పట్టణీకరణ, రేడియేషన్ ప్రభావంతో అవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. ప్రతి ఏటా మార్చి 20న పిచ్చుకల దినోత్సవం నిర్వహిస్తున్నా ప్రభుత్వం వాటి సంరక్షణకు శ్రద్ధ చూపడం లేదు.
News March 20, 2025
నాగార్జునసాగర్కు భారీగా కేటాయింపులు

నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్ను భారీగా పెంచింది. గతేడాది బడ్జెట్లో రూ.96.07 కోట్లు మాత్రమే కేటాయించిన ప్రభుత్వం ఈసారి వాటిని రూ.297.95 కోట్లకు పెంచింది. ఆ నిధులతో డ్యాం సంబంధిత, ప్రధాన పనులు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపడతామని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో సాగర్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 20, 2025
సూర్యాపేట జిల్లాలో యువతిపై అత్యాచారం

HNRలో యువతిపై అత్యాచారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SI ముత్తయ్య తెలిపిన వివరాలిలా.. పట్టణానికి చెందిన స్వామిరోజాకు ఓ యువతితో పరిచయముంది. రోజా ద్వారా ఆమె ప్రియుడు ప్రమోద్కుమార్ యువతికి పరిచయమయ్యాడు. ఈనెల 7న ఆ యువతిని ప్రమోద్ కుమార్ ఓ లాడ్జికి తీసుకెళ్లి మద్యం తాపి అత్యాచారం చేసి ఫోటోలు తీశారు. తిరిగి మంగళవారం ఆ యువతిని లోబర్చుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది.