News March 19, 2025

ఫ్రిజ్‌లో 12 టన్నుల మేక మాంసం..!

image

హైదరాబాద్‌లోని మంగళ్‌హట్‌లో రూ.8 లక్షలు విలువ చేసే 12 టన్నుల మేక మాంసాన్ని GHMC టాస్క్ ఫోర్స్ సిబ్బంది సీజ్ చేశారు. మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యాపారి తక్కువ ధరకు గొర్రెలు, మేకల మాంసాన్ని కొని ప్రిజ్‌లో భద్రపరుస్తున్నట్లు గుర్తించారు. ఇలా నిల్వచేసిన మాంసాన్ని హోటళ్లు, శుభకార్యాలకు సప్లై చేస్తున్నట్లు తేల్చారు. ఈ ఘటనతో రెస్టారెంట్లలో తినే ముందు ఆలోచించాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News March 28, 2025

జస్టిస్ వర్మపై FIR నమోదు చేయాలని డిమాండ్

image

ఢిల్లీ హైకోర్టు జడ్జి <<15855499>>యశ్వంత్ వర్మపై<<>> FIR నమోదు చేయాలని మాథ్యూ నెడుంపారా అనే లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ అనవసరమని మాథ్యూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసుల నేతృత్వంలో దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

News March 28, 2025

సౌత్ ఆడియన్స్ మా సినిమాలను చూడరు: సల్మాన్ ఖాన్

image

భారీ బడ్జెట్ సినిమాలను తీయడం చాలా కూడుకున్నదని, దానికి బలమైన స్క్రిప్ట్ ఉండాలని సల్మాన్ ఖాన్ అన్నారు. ‘సికందర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ‘సౌత్ సినిమాలను హిందీ ఆడియన్స్ చూస్తారు. కానీ సౌత్ ప్రేక్షకులు బాలీవుడ్ సినిమాలను చూడరు. నేను ఎంతో మంది సౌత్ డైరెక్టర్లు, టెక్నీషియన్లతో పనిచేశాను. కానీ నా సినిమాలు దక్షిణాదిలో అంతగా ఆడటం లేదు’ అని పేర్కొన్నారు.

News March 28, 2025

భారత్ ఖాతాలో మరో 3 పతకాలు

image

ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్-2025లో భారత్‌ ఖాతాలో మరో 3 పతకాలు చేరాయి. ముగ్గురు మహిళా రెజ్లర్లు మెడల్స్ సాధించారు. రీతిక 76 కేజీల విభాగంలో సిల్వర్, ముస్కాన్ (59kgs), మాన్సీ(68kgs) బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ గెలిచిన పతకాల సంఖ్య 5కు (1 సిల్వర్, 4 బ్రాంజ్) చేరింది. ఈ పోటీలు జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరుగుతున్నాయి.

error: Content is protected !!