News March 19, 2025

తిరుపతి: హిందీ పరీక్షకు 272 మంది గైర్హాజరు

image

తిరుపతి జిల్లాలో రెండవ రోజు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 26,413 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. 272 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. బుధవారం ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.

Similar News

News January 8, 2026

KNR: బ్యాంకుల భద్రతపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

image

బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను పటిష్టం చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. బ్యాంక్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం హై-క్వాలిటీ సీసీ కెమెరాలు, పానిక్ బటన్లు, బర్గ్లర్ అలారమ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగదు తరలింపుపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, సైబర్ మోసాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.

News January 8, 2026

రాజులకొత్తూరు వద్ద ప్రమాదం.. నాలుగు కార్లను ఢీకొన్న లారీ

image

తుని మండలం రాజులకొత్తూరు జాతీయ రహదారి 216 పై జరిగిన ప్రమాదం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి వెళ్తున్న ఓ లారీ బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి వరుసగా నాలుగు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో కార్లు పూర్తిగా తుక్కుతుక్కయ్యాయి. కార్లలో ఉన్న ప్రయాణికులందరూ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడటం విశేషం. ధ్వంసమైన వాహనాలను చూసి వాహనదారులు విస్మయానికి గురవుతున్నారు.

News January 8, 2026

ఆర్టీఐ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

image

పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అందించడంలో సమాచార హక్కు చట్టం కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పేర్కొన్నారు. నస్పూర్ కలెక్టరేట్‌లో వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆర్టీఐ రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. సరైన నివేదికల నిర్వహణ ద్వారా జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు.