News March 19, 2025

కన్నుల పండువగా రాజరాజేశ్వర స్వామి రథోత్సవం

image

దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి రథోత్సవం బుధవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. శివ కళ్యాణోత్సవంలో భాగంగా రాజరాజేశ్వరి స్వామి పార్వతి అమ్మవారు కళ్యాణం జరిగిన మూడోరోజు సాయంత్రం స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు.

Similar News

News March 20, 2025

ఉమ్మడి ఖమ్మంలో ప్రాజెక్టులకు రూ.770 కోట్లు

image

అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, నిధులు దండిగా కేటాయించారు. సీతారామకు రూ.699.53 కోట్లు, ఎర్రుపాలెం(ఎల్ఐ) రూ.39.93 కోట్లు, కిన్నెరసానికి రూ.13.33 కోట్లు, తాలిపేరు రూ.7.30 కోట్లు, భక్తరామదాసు రూ.9 లక్షలు, లంకాసాగర్ రూ.1లక్ష కేటాయించారు. వ్యవసాయరంగానికి ఊతమిచ్చేలా జిల్లాకు నిధులు కేటాయించారని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది.

News March 20, 2025

ఉమ్మడి ఖమ్మంలో ప్రాజెక్టులకు రూ.770 కోట్లు

image

అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిస్తూ, నిధులు దండిగా కేటాయించారు. సీతారామకు రూ.699.53 కోట్లు, ఎర్రుపాలెం(ఎల్ఐ) రూ.39.93 కోట్లు, కిన్నెరసానికి రూ.13.33 కోట్లు, తాలిపేరు రూ.7.30 కోట్లు, భక్తరామదాసు రూ.9 లక్షలు, లంకాసాగర్ రూ.1లక్ష కేటాయించారు. వ్యవసాయరంగానికి ఊతమిచ్చేలా జిల్లాకు నిధులు కేటాయించారని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 20, 2025

బై.. బై.. ముగిసిన ‘ఇంటర్‌ ప్రథమ’ పరీక్షలు

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. తల్లిదండ్రులతో సొంతూరిలో సరదాగా గడపడం కోసం ఎపుడెపుడా అని నిరీక్షించిన విద్యార్థులకు ఆ సమయం వచ్చేసింది. పరీక్షలు ముగిసిన వెంటనే సొంతూళ్లకు ఉరుకులు పరుగులు పెట్టారు. పరీక్షా కేంద్రాల నుంచి బయటకు వస్తూనే కేరింతలతో సందడి చేశారు. ఊళ్లకు వెళ్లే విద్యార్థులు, ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి.

error: Content is protected !!