News March 19, 2025
KMR: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణ పనుల్లో అపశృతి చేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రాములు(42) అనే వ్యక్తికి బుధవారం పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తాకడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
Similar News
News November 3, 2025
జిల్లాలో సాధారణంగానే చలి తీవ్రత

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత సాధారణంగానే ఉంది. గడిచిన 24 గంటల్లో గొల్లపల్లిలో 22.6℃, మన్నెగూడెం 22.8, పెగడపల్లె 22.9, కోరుట్ల 23.0, కథలాపూర్, గోవిందారం 23.1, రాఘవపేట, జగ్గసాగర్, తిరుమలాపూర్ 23.2, రాయికల్, ఐలాపూర్, గోదూరు 23.3, కొల్వాయి, పూడూర్, పొలాస 23.4, బుద్దేశ్పల్లి, మేడిపల్లె, మల్యాల, జగిత్యాల 23.5, మల్లాపూర్లో 23.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లో చలి తీవ్రత తక్కువగానే ఉంది.
News November 3, 2025
వనపర్తి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్: ఎస్పీ

వనపర్తి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఈనెల 30 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే సమావేశాలు పూర్తిగా నిషేధించామని చెప్పారు.
News November 3, 2025
వనపర్తి: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి

విద్యుత్ వినియోగదారుల దినోత్సవాన్ని సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని డివిజనల్ ఇంజినీర్ కార్యాలయంలో TGSPDCL ఎస్ఈ రాజశేఖరమ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని వినియోగదారుల నుంచి 18 ఫిర్యాదులను స్వీకరించారు. పాడైన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ మీటర్ బిల్లులు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సమస్యలపై వినియోగదాల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. డీఈ. శ్రీనివాస్, వెంకటేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.


