News March 24, 2024

దేశంలో 370 సీట్లు.. ప్రతి బూత్‌లో 370 ఓట్లు: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్రంలో 17 స్థానాలు కాంగ్రెస్ గెలవదని.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రధాని కాలేరని రాష్ట్ర BJP చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. పదాధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 370 సీట్లు.. ప్రతి పోలింగ్ బూత్‌లో 370 ఓట్లు BJPకి వచ్చేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. బూత్ కమిటీల బలోపేతంపై చర్చించారు. ఏప్రిల్ 6న రాష్ట్రంలోని ప్రతి బూత్‌లో బీజేపీ టిఫిన్ బైటక్ నిర్వహించాలని సూచించారు.

Similar News

News October 3, 2024

పెట్రోల్ ధరల పెంపు?

image

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరిగాయి. 71 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర 2.7% పెరిగి 75 డాలర్లకు చేరింది. ప్రపంచంలో మూడో వంతు దేశాలకు ప్రస్తుతం ఇరాన్ నుంచే ఆయిల్ సప్లై అవుతోంది. ముడిచమురు ధరలకు అనుగుణంగానే మన దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేస్తున్నాయి. ఫలితంగా పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

News October 3, 2024

సన్యాసం స్వీకరించాలని ఎవరినీ అడగం: ఈశా ఫౌండేషన్

image

తమిళనాడు కోయంబత్తూరులోని <<14238933>>ఈశా<<>> యోగా కేంద్రంలో జరుగుతున్న పోలీసు తనిఖీలపై నిర్వాహకులు స్పందించారు. ప్రజలకు యోగా, ఆధ్యాత్మికతను అందించేందుకు సద్గురు ఈశా ఫౌండేషన్‌ను ప్రారంభించారని పేర్కొన్నారు. వివాహం చేసుకోవాలని గానీ, సన్యాసం స్వీకరించాలని గానీ తామెవ్వరినీ అడగమని స్పష్టం చేశారు. కోర్టులో నిజమే గెలుస్తుందన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 3, 2024

దసరా రోజున నాని కొత్త సినిమా లాంచ్?

image

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న రెండో సినిమాను ఈనెల 12న దసరా సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్‌లో సాగే కథతో తెరకెక్కనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నాని, శ్రీకాంత్ కలిసి గతంలో ‘దసరా’ మూవీ చేశారు.