News March 19, 2025
కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్

యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ సైదులు, ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం బల్లునాయక్ తండా వాసి ధనావత్ పవన్ కుమార్(23) NRPT జిల్లా కొడంగల్ పరిధి మద్దూర్ మండలానికి చెందిన 17ఏళ్ల బాలికను ఇన్స్టాలో పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో మోసగించి, ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా ఈరోజు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.
Similar News
News March 20, 2025
ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం పెరగాలి: కలెక్టర్

మూసాపేట మండలం జానంపేట ప్రైమరీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులదలో అన్ని రకాల వైద్య సేవలు ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా నడుచుకోవాలని సూచించారు.
News March 20, 2025
వనపర్తి జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి.. !

వనపర్తి జిల్లాలో వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. బుధవారం అత్యధికంగా కనైపల్లిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెబ్బేరు, విలియంకొండలో 39.3 డిగ్రీలు, వనపర్తి 39.1, మదనాపూర్, వెల్గొండ 39, ఆత్మకూరు 38.8, రేమద్దుల, పెద్దమండడి, దగడ 38.7, పాన్గల్ 38.6, గోపాలపేట, రేవల్లి 38.5, వీపనగండ్ల 38.3, ఘనపూర్ 38.1, సోలిపూర్ 38, శ్రీరంగాపురం 37.9, కేతేపల్లి 37.7, జానంపేట 37.5, అమరచింతలో 37.4 డిగ్రీలు నమోదైంది.
News March 20, 2025
సామర్లకోట : రైలు దిగుతూ జారి పడి వ్యక్తి మృతి

కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో రైలు నుంచి దిగుతూ ఒక యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పెద్దాపురానికి చెందిన సిమ్ము సిరి త్రినాథ్ తల్లి విజయలక్ష్మి విశాఖపట్నం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో ఉన్న త్రినాథ్ రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి, ప్రమాదానికి గురయ్యాడు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.