News March 19, 2025

KMR: ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

image

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ముగిశాయి. మార్చ్‌5 న ప్రారంభమైన ఈ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఇంటర్ మొదటి సంవత్సరం రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్‌నకు సంబంధించి 7948 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 7719 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1865 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 170 మంది పరీక్షకు దూరంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.

Similar News

News November 10, 2025

అధ్యక్షా అనడం ఇష్టంలేకే జగన్ అసెంబ్లీకి రావట్లేదు: అయ్యన్న

image

AP: జగన్ పులివెందుల MLA మాత్రమేనని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్, YCP MLAలు అసెంబ్లీకి రాకపోవడంపై ఆయన మరోసారి స్పందించారు. ‘అసెంబ్లీలో సాధారణ MLAకి ఇచ్చే సమయమే జగన్‌కు ఇస్తాం. ఆయన మీడియా ముందు కాకుండా అసెంబ్లీకొచ్చి మాట్లాడాలి. నా ముందు అధ్యక్షా అనడం ఇష్టంలేకే అసెంబ్లీకి రావడం లేదు. YCP ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. కానీ, అసెంబ్లీకి మాత్రం రావట్లేదు’ అని వ్యాఖ్యానించారు.

News November 10, 2025

కేడీసీలో ఘనంగా అంతర్జాతీయ అకౌంట్స్ దినోత్సవం

image

హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (KDC) లో అంతర్జాతీయ అకౌంట్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.గుర్రపు శ్రీనివాస మాట్లాడుతూ.. జంట పద్దు విధానాన్ని లూకాపాసియోలి రూపొందించి ఈ రోజున మొదటిసారిగా ప్రచురించారన్నారు. అందువల్లనే ఈరోజున అంతర్జాతీయ అకౌంటింగ్ దినోత్సవంగా జరుపుకొంటారని పేర్కొన్నారు.

News November 10, 2025

భూముల్లో సూక్ష్మపోషక లోపాలు ఎందుకు వస్తాయి?

image

తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో జింకు, ఇనుము, బోరాన్ లోపం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, మాంగనీసు లోపం.. నీరు నిలిచే లోతట్టు భూములు, మురుగు నీరు పోని భూములు, అన్నివేళలా నీరు పెట్టే వరి పొలాల్లో జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువ. సాగు నీటిలో కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్లు ఎక్కువైనప్పుడు ఇనుపదాతు లోపం కనిపిస్తోంది.