News March 19, 2025
సిద్దరామయ్య ఫ్లైట్ జర్నీకి రూ.31 కోట్లు.. తీవ్ర విమర్శలు

రెండేళ్లలో కర్ణాటక CM సిద్దరామయ్య విమాన ప్రయాణానికి రూ.31 కోట్లు ఖర్చు చేశారు. దీనిపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. ఢిల్లీకి రానుపోనూ విమాన ఛార్జీ రూ.70 వేలకు మించదని, అలాంటిది ఛార్టర్ ఫ్లైట్లో వెళ్తూ ఒక ట్రిప్కే రూ.44.40 లక్షలు వృథా చేస్తున్నారని మండిపడుతోంది. రూ.10.85 లక్షలు ఖర్చు చేసి బెంగళూరు నుంచి మైసూరుకు కూడా హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారని విమర్శిస్తోంది.
Similar News
News January 13, 2026
పసుపును ఆరబెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పసుపును ఉడకబెట్టిన తర్వాత శుభ్రం చేసిన పదునైన నేల లేదా టార్పాలిన్ షీట్ లేదా సిమెంట్ నేలపై కుప్పగా పోయాలి. ఒకరోజు తర్వాత 2,3 అంగుళాల మందం ఉండేలా పరచాలి. మరీ పలుచగా పరిస్తే పసుపు రంగు చెడిపోతుంది. పరిచిన పసుపును మధ్యాహ్నం సమయంలో తిరగబెడితే సమానంగా ఎండుతాయి. పసుపు దుంపలు లేదా కొమ్ముల్లో తేమ 8 శాతం వచ్చే వరకు ఎండబెట్టాలి. ఈ స్థితికి రావడానికి 18- 20 రోజులు పడుతుంది. రాత్రివేళ టార్పాలిన్లు కప్పాలి.
News January 13, 2026
సంక్రాంతి: ముగ్గులు వేస్తున్నారా?

సంక్రాంతి పండుగకు ముగ్గులు వేయడం మన సంప్రదాయం. అయితే అందులో బియ్యప్పిండి కలపడం ద్వారా చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించిన వాళ్లమవుతాం. పూర్వం ముగ్గులో బియ్యప్పిండి కలిపే వేసేవారు. ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను ఉంచి, పూలతో అలంకరించడం వల్ల ఆ ప్రాంతం మహాలక్ష్మికి నివాసంగా మారుతుందని నమ్మకం. రథాల ముగ్గులు వేయడం వల్ల అమ్మాయిలలో సృజనాత్మకత పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
News January 13, 2026
తగ్గిన బాస్మతీ రైస్ ధరలు.. కారణమిదే

ఇరాన్లో జరుగుతున్న అల్లర్ల ప్రభావం మన బాస్మతీ బియ్యంపై పడింది. ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో ధరలు కిలోకు ₹5-10 వరకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 5.99 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇరాన్కు ఎగుమతి అయ్యాయి. అక్కడ గొడవలతో పేమెంట్లు ఆగిపోవడం, షిప్మెంట్లు ఆలస్యం కావడంతో ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్లో అస్థిరత వల్ల ధరలు ఇంకా తగ్గొచ్చని అంచనా.


