News March 19, 2025

MBNR: ప్రజారంజక బడ్జెట్: MLA జీఎంఆర్

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ బడ్జెట్ పై ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్యం,ఉపాధి, రైతు, కార్మిక, ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్, తెలంగాణ బడ్జెట్ సీఎం రేవంత్ రెడ్డి కృషితో ప్రజల అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Similar News

News March 20, 2025

BUDGET.. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యం

image

రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. KLIకు రూ.800కోట్లు, కోయిల్‌సాగర్ రూ. 80.73కోట్లు, నెట్టెంపాడుకు రూ.144కోట్లు, సంగంబండకు రూ.98.08కోట్లు, నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు, కురుమార్తి ఆలయ అభివృద్ధికి రూ.110 కోట్లు, పాలమూరు వర్సిటీకి రూ.50కోట్లు కేటాయించగా పాలమూరు ప్రాజెక్టుకు నిరాశే మిగిలింది. బడ్జెట్‌పై మిత్రమ స్పందన వస్తోంది.

News March 20, 2025

MBNR: రంజాన్ మాసం.. హాలీమ్‌కు సలాం.!

image

రంజాన్ నెలలో దర్శనమిచ్చే నోరూరించే వంటకం హలీం. ఉపవాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పటికే ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, ఆయా మండలాల కేంద్రాల్లో హలీం సెంటర్లు దర్శనమిస్తున్నాయి. మాంసం, గోధుమలు, పప్పుదినుసులు, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో కలిపి ఉడికించి తయారు చేస్తారు. చివర్లో వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇస్తారు.మీరు తింటే ఎలా ఉందో కామెంట్ పెట్టండి?

News March 20, 2025

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు 

image

ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వైద్యులను ఆదేశించారు. బుధవారం మూసాపేట మండల పరిధిలోని జానంపేట పీ.హెచ్.సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల వైద్య చికిత్సను పరిశీలించి సమస్యలపై రోగులని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కలెక్టర్ ఆదేశించారు.

error: Content is protected !!