News March 19, 2025
ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా సుచిత్రా ఎల్లా, సతీశ్ రెడ్డి

AP: భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా, DRDO మాజీ చీఫ్ సతీశ్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులయ్యారు. చేనేత, హస్తకళల అభివృద్ధికి సంబంధించి సుచిత్ర, ఏరో స్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అడ్వైజర్గా సతీశ్ను ప్రభుత్వం ఎంపిక చేసింది. క్యాబినెట్ ర్యాంకుతో రెండేళ్లపాటు వీరు పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.
Similar News
News March 20, 2025
ఈ పురస్కారంతో ఆయన కీర్తి మరింత పెరిగింది: పవన్

UK పార్లమెంట్ అందించిన జీవిత సాఫల్య పురస్కారంతో అన్నయ్య చిరంజీవి కీర్తి మరింత పెరిగిందని AP DyCM పవన్ పేర్కొన్నారు. ‘మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో కళామతల్లి దీవెనలతో ఆయన చిత్ర రంగంలో మెగాస్టార్గా ఎదిగారు. ఆయనకు తమ్ముడిగా పుట్టినందుకు గర్విస్తున్నా. నేను ఆయనను అన్నయ్యగా కాకుండా తండ్రి సమానుడిగా భావిస్తా. నాకు మార్గం చూపిన వ్యక్తి ఆయన’ అని ట్వీట్ చేశారు.
News March 20, 2025
యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి

TG: సూర్యాపేట (D) హుజూర్నగర్లో ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూర్నగర్కు చెందిన రోజా తన స్నేహితురాలి(26)ని ఇంటికి పిలిచింది. ఆపై మద్యం తాగించి మత్తులోకి వెళ్లాక రోజా ప్రియుడు ప్రమోద్ ఆ యువతిపై అత్యాచారం చేయగా ఆమె వీడియో తీసింది. బుధవారం మరోసారి ఆ యువతికి ఫోన్ చేసి పిలిపించారు. ఈ సారి తన ఫ్రెండ్ హరీశ్ కోరిక తీర్చాలని ప్రమోద్ కోరగా ఆమె నిరాకరించి పోలీసులను ఆశ్రయించారు.
News March 20, 2025
‘కోర్టు’ కలెక్షన్లలో తగ్గేదేలే..

‘కోర్టు’ మూవీ కలెక్షన్ల పర్వం కొనసాగుతోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.36.85 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. అభిమానుల తీర్పుతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచిందని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రల్లో నటించారు.