News March 19, 2025
కందుకూరు యువకుడికి గేట్లో మొదటి ర్యాంక్

గేట్ ఫలితాలు నేడు వెలువడిన విషయం తెలిసిందే. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరుకి చెందిన సాదినేని నిఖిల్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి శ్రీనివాసులు కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. నిఖిల్ చెన్నై IITలో ఆన్లైన్ ద్వారా డేటా సైన్స్లో డిగ్రీ చేశాడు. అంతేకాకుండా ఇతను ఢిల్లీ ఎయిమ్స్లో MBBS పూర్తి చేశాడు.
Similar News
News December 28, 2025
తర్లుపాడు KGBV విద్యార్థులతో వంట పనులు

తర్లుపాడు మండలం కలుజువ్వులపాడు పంచాయతీలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో వంట పనులు చేయిస్తున్నట్లు ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిల్లలతో చపాతీలు చేయించడం, వంట సామాను కడిగించడం, గదులు శుభ్రంచేయించడం వంటి పనులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. చదువు చెప్పాల్సిన సిబ్బంది పిల్లలతో చాకిరీ చేయించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 28, 2025
ప్రకాశం కలెక్టర్తో MLA ఉగ్ర భేటీ.!

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబును కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా కలెక్టర్తో ఆయన చర్చించారు. ఎమ్మెల్యే తెలిపిన అంశాలపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించి అభివృద్ధికి సంబంధించిన అంశాలకు తన వంతు సహకరిస్తానని తెలిపారు.
News December 28, 2025
ప్రకాశం కలెక్టర్తో MLA ఉగ్ర భేటీ.!

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ రాజాబాబును కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా కలెక్టర్తో ఆయన చర్చించారు. ఎమ్మెల్యే తెలిపిన అంశాలపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించి అభివృద్ధికి సంబంధించిన అంశాలకు తన వంతు సహకరిస్తానని తెలిపారు.


