News March 24, 2024

ఓటర్లకు సైబర్ నేరగాళ్ల వల.. లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ

image

ఎన్నికల వేళ సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. ఓటర్ కార్డు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదని, ఎన్నికల సర్వేలో పాల్గొంటే బహుమతులని ప్రజల ఫోన్లకు లింకులు పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి లింకులను క్లిక్ చేయొద్దని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News October 3, 2024

మండే ఎండలు.. భారీ వర్షాలు

image

APలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓవైపు వర్షాలు కురుస్తుండగా మరోవైపు ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న నెల్లూరులో 40.7 డిగ్రీలు, కావలిలో 39.8, అనంతపురంలో 38.9, తిరుపతిలో 37.6 అమరావతిలో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇవాళ ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

News October 3, 2024

పెట్రోల్ ధరల పెంపు?

image

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరిగాయి. 71 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర 2.7% పెరిగి 75 డాలర్లకు చేరింది. ప్రపంచంలో మూడో వంతు దేశాలకు ప్రస్తుతం ఇరాన్ నుంచే ఆయిల్ సప్లై అవుతోంది. ముడిచమురు ధరలకు అనుగుణంగానే మన దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేస్తున్నాయి. ఫలితంగా పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

News October 3, 2024

సన్యాసం స్వీకరించాలని ఎవరినీ అడగం: ఈశా ఫౌండేషన్

image

తమిళనాడు కోయంబత్తూరులోని <<14238933>>ఈశా<<>> యోగా కేంద్రంలో జరుగుతున్న పోలీసు తనిఖీలపై నిర్వాహకులు స్పందించారు. ప్రజలకు యోగా, ఆధ్యాత్మికతను అందించేందుకు సద్గురు ఈశా ఫౌండేషన్‌ను ప్రారంభించారని పేర్కొన్నారు. వివాహం చేసుకోవాలని గానీ, సన్యాసం స్వీకరించాలని గానీ తామెవ్వరినీ అడగమని స్పష్టం చేశారు. కోర్టులో నిజమే గెలుస్తుందన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.