News March 20, 2025

రైతుల నుంచి ఫిర్యాదులు రాకూడదు: జేసీ

image

రీ సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి అయిన గ్రామాలలోని రైతులకు 9(2) నోటీసులను అందచేయాలని జేసీ రాహుల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ డివిజన్ అధికారులతో మాట్లాడారు. 13 గ్రామాలలో రైతులకు 9(2) నోటీసులను అందజేయాలన్నారు. ఏ ఒక్క రైతుకు తన భూమికి సంబంధించి నోటీసులు అందలేదని ఫిర్యాదులు రాకూడదన్నారు.

Similar News

News January 17, 2026

పాస్ పుస్తకంతో సులభంగా భూమి వివరాలు: జేసీ

image

రైతులు తమ భూమికి సంబంధించిన వివరాలను పాసు పుస్తకాల ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం ఆచంట మండలం పెనుమంచిలి గ్రామ సచివాలయం వద్ద జరిగిన గ్రామ సభలో జేసీ పాల్గొన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలను పరిశీలించారు. గ్రామ సభకు హాజరైన రైతులతో ఆయన మాట్లాడారు. రైతుల సందేహాలను నివృత్తి చేసి, పలు సూచనలు చేశారు.

News January 17, 2026

ప.గో: బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడు

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వృద్ధుడిని భీమవరం టూటౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్సై రెహమాన్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి వీధికి చెందిన కోణాల సరస్వతి (84) స్థానిక బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు.

News January 17, 2026

భీమవరం: యువ హీరో సిద్ధు జొన్నలగడ్డకు ‘సోగ్గాడు’ పురస్కారం

image

నటభూషణ్ శోభన్ బాబు 90వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నుంచి యువ హీరోలకు అందించనున్న ‘సోగ్గాడు’ అవార్డుకు సిద్ధు జొన్నలగడ్డను ఎంపిక చేసినట్లు ప్రతినిధి భట్టిప్రోలు శ్రీనివాసరావు తెలిపారు. త్వరలో శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జరగనున్న వేడుకలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు. వెండితెరపై ప్రజ్ఞాపాటవాలు ప్రదర్శించే గ్లామర్ హీరోలకు ఈ గౌరవం దక్కనుంది.