News March 20, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

✔TG KHO-KHO జట్టుకు ఎంపికైన పీడీ కే.కవిత(పుట్టపాడు)
✔GET READY.. టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం
✔కొడంగల్: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్
✔ముగిసిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు
✔VKB: ‘బీజేపీ జిల్లా నూతన అధ్యక్షుని మార్చాలి’
✔VKB: కొనసాగుతున్న ఆదివాసీ కాంగ్రెస్ ట్రైనింగ్ ప్రోగ్రాం
✔గట్టేపల్లి-నాగ సముందార్ మార్గంలో జింక మృత్యువాత
✔ఇంటి పన్ను..జిల్లాలోనే ప్రథమ స్థానంలో కోట్పల్లి
Similar News
News September 18, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ బిల్లులు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ బిల్లులు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున వారి ఖాతాల్లో జమ అయిన నాలుగు రోజుల తర్వాత తిరిగి అదే మొత్తాన్ని మరోసారి జమ చేశారు. ఈ విషయం గమనించిన గృహనిర్మాణ శాఖ అధికారులు డబుల్ బిల్లులు పొందిన లబ్ధిదారుల నుంచి డబ్బును రికవరీ చేసి, ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయాలని స్థానిక ఏఈ, ఎంపీడీవోలను ఆదేశించారు.
News September 18, 2025
ADB: చుక్క నీటి కోసమే చుట్టూ పోరాటం!

ధనరాశులు ఎంతైనా పోగుచేయగలం కానీ, జలరాశులను సృష్టించలేం. నీటిని వృథా చేస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనడానికి ఉమ్మడి ADBలో ఏర్పడిన ఘటనలే నిదర్శనం. 5నదులు, 14 వాగులు, 3500+ చిన్న నీటి వనరులున్న జిల్లాలో వానాకాలంలో తాగునీటి కష్టాలు చూస్తున్నాం. పట్టణాల్లో చెరువులు, వాగులను ఆక్రమించడంతో వానలకు వరదలు రాగా.. ఎండాకాలంలో ట్యాంకర్లతో నీరు తెప్పించుకునే పరిస్థితి.
#నేడు నీటి పర్యవేక్షణ దినోత్సవం.
News September 18, 2025
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాడకంపై నిషేధం!

ప్లాస్టిక్ నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో నిషేధించాలని నిర్ణయించింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. డిసెంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్లో చెత్తను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతి సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తున్నారు.