News March 20, 2025
10వ తరగతి పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై బుధవారం సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలన్నారు.
Similar News
News November 13, 2025
వంటింటి చిట్కాలు

* కరివేపాకును ఎండబెట్టి పొడిచేసుకుని కూరల్లో వేసుకుని తింటే కమ్మటి వాసన వస్తుంది.
* తేనె సీసాలో రెండు మిరియాలు వేస్తే చీమలు రావు.
* బియ్యం పురుగు పట్టకూడదంటే కరివేపాకులు వేయాలి.
* కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే త్వరగా పెరుగు పాడవదు.
* నెయ్యి పేరుకుపోకుండా ఉండాలంటే మీగడ కట్టేటప్పుడు కొద్దిగా నీళ్లు చల్లాలి.
* చిటికెడు సోడా వేసి గోధుమ పిండిని తడిపితే పూరి మెత్తగా, రుచిగా ఉంటుంది.
News November 13, 2025
ప్రతీసారి కొట్టేది మేము.. కొట్టించుకునేది మీరు: కాంగ్రెస్ SM

జూబ్లీహిల్స్లో కాంగ్రెస్దే విజయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో BRSను ఆ పార్టీ శ్రేణులు SMలో ట్రోల్ చేస్తున్నాయి. ‘అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో, కంటోన్మెంట్లో కొట్టాం. జూబ్లీహిల్స్లో కొడుతున్నాం. ప్రతీసారి కొట్టేది మేము, కొట్టించుకునేది మీరు. ఔర్ కుచ్ బాకీ హై క్యా’ అని పోస్టులు పెడుతున్నాయి. MBNRలో MLC ఎన్నికల్లో ఓడింది మర్చిపోయారా? అని BRS వర్గాలు రివర్స్ కౌంటర్ వేస్తున్నాయి.
News November 13, 2025
సంగాడ్డి: క్రమక్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

సంగారెడ్డి జిల్లాలో వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. గురువారం ఉదయం వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిన్నారంలో 13.1 డిగ్రీలు, గుమ్మడిదలలో 17.0 డిగ్రీలు, అమీన్పూర్లో 18.2° డిగ్రీలు, రామచంద్రాపురంలో 12.5 డిగ్రీలు, పటాన్చెరులో 12.8° ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 90.6%గా నమోదైంది. ఉదయం పూట చల్లని గాలులు వీచడంతో గ్రామస్థులు చలిమంటలను కాచుకుంటున్నారు.


