News March 20, 2025
చిత్తూరు: కురబ కులస్థుల పెద్ద జాతరకు రావాలని YS జగన్కు ఆహ్వానం

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం జ్యోగ్గానూరులో కురబ కులస్థుల సిద్దేశ్వర, వీరేశ్వర పెద్ద జాతరకు రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్కు జడ్పీటీసీ కృష్ణమూర్తి, మునెప్ప, రవిలు కోరారు. ఏడేళ్లకు ఒకసారి వైభవంగా పెద్ద జాతరను నిర్వహిస్తారు. బుధవారం విజయవాడలో జగన్ను కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. కురబ కులస్థులకు ఆయన ఈ సందర్భంగా జాతర శుభాకాంక్షలు తెలిపినట్లు వారు తెలిపారు. కులస్థుల – సిద్దేశ్వర – సందర్భంగా
Similar News
News March 28, 2025
హీరోను అంటూ నమ్మించి దారుణం.. కేసు నమోదు

హీరోను అంటూ నమ్మించి మహిళను మోసం చేసిన ఘటనలో యువకుడిపై నెల్లూరు(D) చిన్నబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి(D) కోట(M)నికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడిపోయింది. నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెకు ఇన్స్టాలో సునీల్ రెడ్డి పరిచయం అయ్యాడు. హీరోను అంటూ నమ్మించి లాడ్జిలో శారీరకంగా దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకోమని కోరగా ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలతో సునీల్ బెదిరించి దాడి చేశాడు.
News March 28, 2025
చిత్తూరు: బాలికపై అత్యాచారం.. వైసీపీ నేతకు రిమాండ్

బాలికపై అత్యాచారం చేసిన కేసులో నలుగురికి కోర్టు రిమాండ్ విధించింది. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు(D)కు చెందిన ఓ బాలిక కలికిరి(M)లోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఇంటర్ చదువుతోంది. ఈ ఏడాది జనవరి 25న బాలిక కనపడలేదు. YCP నేత అహ్మద్ పెద్ద కొడుకు జునేద్ అహ్మద్ తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడు.
News March 28, 2025
ఆర్మీలో ఉద్యోగావకాశాలు: చిత్తూరు కలెక్టర్

ఆర్మీలో ఉద్యోగాలపై చిత్తూరు కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. గుంటూరులో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు మార్చి 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 10 చివరి తేదని కలెక్టర్ వెల్లడించారు.