News March 20, 2025
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రగతిశీల బడ్జెట్: చిన్నారెడ్డి

అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టింది ప్రగతిశీల బడ్జెట్ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. సేవారంగానికి అధిక నిధులు కేటాయించింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనన్నారు. అభివృద్ధి సంక్షేమ సేవా రంగాలకు తగు పాళ్లలో కేటాయింపులు చేశారని రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి బడ్జెట్ తోడ్పడుతుందని అన్నారు.
Similar News
News February 24, 2026
ములుగు: బెస్ట్ అవైలబుల్ స్కీంకు దరఖాస్తు ఆహ్వానం

ములుగు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ 2025-26 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీం కింద అర్హత గల ప్రైవేట్ పాఠశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. 1వ తరగతి నాన్ రెసిడెన్షియల్, 5వ తరగతి రెసిడెన్షియల్ ప్రవేశాల కోసం ఫిబ్రవరి 24 నుంచి మార్చి 25, 2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 90% ఉత్తీర్ణత కలిగిన పాఠశాలలు దరఖాస్తు చేయాలన్నారు.
News February 24, 2026
గుంటూరు: ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరీ.. నిందితులు వీరే..!

MLA ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడారు. నిందితుల నుంచి 10కేజీల వెండి, 42 సవర్ల బంగారం, రూ.లక్ష నగదు రికవరీ చేశామన్నారు. సత్తెనపల్లి రాకేష్, కొక్కిలిగడ్డ ఆశీర్వాదం దొంగతనానికి పాల్పడ్డారని, వీరిపై గతంలో 34కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసులో మొత్తం 8మంది నిందితులను గుర్తించి, ఐదుగురిని అరెస్ట్ చేసామన్నారు.
News February 24, 2026
KNR: ‘మహిళా కార్యకర్తలు కృషి చేయాలి’

కరీంనగర్ DCC కార్యాలయంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో నేడు సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత పదేళ్లుగా పార్టీ కోసం పోరాడిన సీనియర్ మహిళా నేతలకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. రాబోయే ZPTC, MPTC ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మహిళా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


