News March 20, 2025
మార్చి 20: చరిత్రలో ఈరోజు

*1351: మహ్మద్ బిన్ తుగ్లక్ మరణం
*1951: భారత్ మాజీ క్రికెటర్ మదన్ లాల్ జననం
*1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
*1986: హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ జననం
*2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం
* అంతర్జాతీయ సంతోష దినోత్సవం
* ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
Similar News
News March 20, 2025
చరిత్ర సృష్టించిన ‘ఛావా’

శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ చరిత్ర సృష్టించింది. ‘బుక్ మై షో’లో 12 మిలియన్ టికెట్లు సేల్ అయిన తొలి హిందీ చిత్రంగా నిలిచింది. దేశంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు(రూ.767కోట్లు), విడుదలైన ఐదో వారంలో రూ.22కోట్లు వసూలు చేసిన తొలి మూవీగానూ హిస్టరీ క్రియేట్ చేసింది. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా FEB 14న రిలీజైన విషయం తెలిసిందే.
News March 20, 2025
వీరు షెఫ్లే.. కానీ ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే

షెఫ్లే కదా అని వారిని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. వారి ఆస్తులు రూ.కోట్లలో ఉంటాయి మరి. ప్రకటనల్లో తరచూ కనబడే సంజీవ్ కపూర్ దేశంలోని షెఫ్లలో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి విలువ రూ.1165 కోట్లకు పైమాటే. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వికాస్ ఖన్నా(సుమారు రూ.120 కోట్లు), రణ్వీర్ బ్రార్(రూ.41 కోట్లు), కునాల్ కపూర్ (రూ.43.57 కోట్లు), గరిమా అరోరా (రూ.40 కోట్లు), హర్పాల్ సింగ్ సోఖి(రూ.35 కోట్లు) ఉన్నారు.
News March 20, 2025
రాత్రి 7 గంటలలోపు ఈ పని చేస్తే?

రాత్రి 7 గంటలలోపు భోజనం చేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 7 గంటలకు ముందే డిన్నర్ చేస్తే ఆయుర్దాయం 35 శాతం పెరుగుతుందని చెబుతున్నారు. త్వరగా భోజనం చేస్తే జీర్ణం కావడానికి, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది. డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. బరువు తగ్గే అవకాశం ఉంది. గుండె జబ్బులు వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది.