News March 20, 2025
పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS: వరంగల్ సీపీ

ఈనెల 21 నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరీక్ష కేంద్రాల వద్ద ఏప్రిల్ 4 వరకు సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(144 సెక్షన్) అమలులో ఉంటుందని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు ఐదు వందల మీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి గుంపులుగా ఉండొద్దని సీపీ సూచించారు.
Similar News
News March 20, 2025
విశాఖలో పార్టీ మారిన వైసీపీ కార్పొరేటర్లు

జీవీఎంసీలో ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు నారా లోకేశ్, పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేనలో గురువారం చేరారు. పార్టీ మారిన వారిలో 13వ వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత, 17వ వార్డు కార్పొరేటర్ గేదెల లావణ్య, 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, 54వ వార్డు కార్పొరేటర్ చల్లా రజిని, 57వ వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి, 36వ వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ ఉన్నారు.
News March 20, 2025
పర్యాటకులను మెప్పించేలా మరుగుదొడ్లు: కమిషనర్

వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం నగరంలోని కేటీ రోడ్, జక్కంపూడి, వైవీఆర్ ఎస్టేట్స్, పాతపాడు, అయోధ్య నగర్ ప్రాంతాలను గురువారం పరిశీలించారు. పబ్లిక్ టాయిలెట్లు పర్యాటకులను ఆకర్షించేలా ఉండాలన్నారు. నూతన మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులకు సూచించారు. మహిళల కోసం ప్రతి సర్కిల్లో పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న STP లు, రిజర్వాయర్లు, పిగ్ షెడ్ పనులను వేగంగా పూర్తిచేయాలని అన్నారు.
News March 20, 2025
వీరు షెఫ్లే.. కానీ ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే

షెఫ్లే కదా అని వారిని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. వారి ఆస్తులు రూ.కోట్లలో ఉంటాయి మరి. ప్రకటనల్లో తరచూ కనబడే సంజీవ్ కపూర్ దేశంలోని షెఫ్లలో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి విలువ రూ.1165 కోట్లకు పైమాటే. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వికాస్ ఖన్నా(సుమారు రూ.120 కోట్లు), రణ్వీర్ బ్రార్(రూ.41 కోట్లు), కునాల్ కపూర్ (రూ.43.57 కోట్లు), గరిమా అరోరా (రూ.40 కోట్లు), హర్పాల్ సింగ్ సోఖి(రూ.35 కోట్లు) ఉన్నారు.