News March 20, 2025
MNCL: చనిపోయినోళ్ల పేరు మీద లోన్లు.. రూ.కోటి ఘరానా మోసం

చోళ మండలం ఇన్వెస్ట్మెంట్&ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ హౌసింగ్ ఫైనాన్స్ మంచిర్యాల బ్రాంచ్లో ఘరానా మోసం జరిగినట్లు CI ప్రమోద్రావు తెలిపారు. చనిపోయిన ఆరుగురి పేర్ల మీద ఇద్దరు బ్యాంక్ అధికారులు లోన్స్ పంపిణీ చేశారు. రూ.1,39,90,000ల మోసానికి బ్రాంచ్ మేనేజర్ చల్ల ప్రవీణ్ రెడ్డి, కరీంనగర్లో పనిచేస్తున్న చిట్టేటి అశోక్ రెడ్డి పాల్పడ్డట్లు తేలింది. కేసులో భాగంగా ప్రవీణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News March 20, 2025
నాగర్ కర్నూల్: దివ్యాంగులకు యూనిక్ డిజబిలిటీ కార్డుపై అవగాహన సదస్సు

యూడీఐడీ కార్డుపైగా అవగాహన సదస్సును ఈరోజు డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగుల సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాగర్కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్, నిరంజన్, గణేశ్ కుమార్, బాల పీర్ తదితరులు పాల్గొన్నారు.
News March 20, 2025
బాపట్ల: కలెక్టర్ను కలిసిన R&B ఈఈ

బాపట్ల జిల్లా రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఆర్. రాజా నాయక్ గురువారం బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్కు మొక్కను అందజేశారు.
News March 20, 2025
ప్యాపిలి: స్కూల్ అసిస్టెంట్పై సస్పెన్షన్ వేటు

ప్యాపిలి మండలం ఏనుగుమర్రి జడ్పీ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ యం.బొజ్జన్న విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించడమే కాకుండా విద్యార్థుల పట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించినట్లు మండల విద్యాశాఖ అధికారి, డిప్యూటీ విద్యాశాఖ అధికారి తమ నివేదికల్లో వెల్లడించినట్లు చెప్పారు.