News March 20, 2025

125 గ్రామాలకు 118.11 లక్షలు: KMR కలెక్టర్

image

వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో మిషన్ భగీరథ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారులతో తాగు నీటి సమస్యలపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 125 గ్రామాల్లో రూ.118.11 లక్షల అంచనాలతో పనులు చేపట్టుటకు జీపీ, కృషియాల్ బ్యాలెన్స్ ఫండ్ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

Similar News

News March 20, 2025

సంతోషాన్ని పంచుకోండి మామా!

image

సంతోషాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఒకానొకప్పుడు సంతోషం అంటే మనుషుల మాటల్లో, వారు పంచే ఆప్యాయతలో ఉండేది. ఇప్పుడు వస్తువుల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. పక్కనున్న వ్యక్తి సంతోషాన్ని చూసి కొందరు కుళ్లుకుంటున్నారు. ఉన్నది ఒకటే జిందగీ.. ఇకనైనా ఇలాంటివి మాని సంతోషాన్ని ఇతరులతో పంచుకుందాం. ఒక చిరునవ్వు, మంచి మాట, చిన్న సహాయం చేసి ఎదుటివారి సంతోషానికి కారణం అవుదాం. ఈరోజు వరల్డ్ హ్యాపీనెస్ డే.

News March 20, 2025

కష్ణా: ‘డాక్టర్ శ్రీహరి హత్య కేసు దోషులను పట్టుకోవాలి’

image

కృష్ణాజిల్లా అవనిగడ్డలో డా. కే శ్రీహరి హత్య కేసు దోషులను పట్టుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో 2020వ సంవత్సరంలో వివేకానంద రెడ్డి హత్య తరహాలోనే డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా సీబీసీఐడి విచారణ చేపట్టి డాక్టర్ కోట శ్రీహరి హంతకులను పట్టుకోవాలని కోరారు.

News March 20, 2025

VJA: సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలి: కలెక్టర్

image

విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో గురువారం దాతలు ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి ఆర్వో ప్లాంట్‌, వైద్య శిబిరాలను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజల దాహర్తి తీర్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు.

error: Content is protected !!