News March 20, 2025
భైoసా: ఆల్ ఇండియా పోటీలకు తపాలా ఉద్యోగులు

ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే క్రీడల్లో సత్తాచాటి జాతీయస్థాయికి ఎంపికయ్యారు జిల్లాకు చెందిన తపాలా ఉద్యోగులు వినోద్ కుమార్, నరేశ్కుమార్. HYDలో జరిగిన జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరిగే పోటీల్లో వీరు RSB HYD జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ కూడా ప్రతిభ చాటాలంటే ఆల్ ది బెస్ట్ చెప్పేయండి మరి.
Similar News
News November 7, 2025
ఊచకోత.. 6 ఓవర్లలో 148 రన్స్

Hong Kong Sixes 2025 టోర్నమెంట్లో అఫ్గానిస్థాన్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 6 ఓవర్ల మ్యాచులో ఏకంగా 148/2 చేసింది. కెప్టెన్ గుల్బదిన్ 12 బంతుల్లో 50, జనత్ 11 బంతుల్లో 46 రన్స్ చేశారు. వీరిద్దరి స్ట్రైక్ రేట్స్ 400కు పైగానే ఉండటం విశేషం. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 6 ఓవర్లలో 99 రన్స్ చేసి 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచులో ఇరుజట్ల బ్యాటర్లు కలిపి 25 సిక్సర్లు బాదారు.
News November 7, 2025
వేదాలను ఎందుకు చదవాలి?

ప్రతి జీవి కోరుకునేది ఆనందం. దాన్ని పొందడానికి మనిషి 2 విషయాలు చేస్తాడు. మొదటిది కోరుకున్న వాటిని పొందడం. అంటే మంచి చదువు, ఉద్యోగం, ఐశ్వర్యం. రెండోది ఇష్టం లేని వాటిని వదిలించుకోవడం. అంటే అనారోగ్యం, అప్పులు అన్నమాట. ఈ రెండు కోరికలు నెరవేరడానికి ఏం చేయాలో వేదాలు బోధిస్తాయి. వేదాలు ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వడమే కాక, కోరికలను నెరవేర్చుకోవడానికి, సమస్యలను తొలగించుకోవడానికి పరిష్కారం చూపుతాయి. <<-se>>#VedikVibes<<>>
News November 7, 2025
VKB: వందేమాతరం దేశ సమైక్యతకు తోడ్పడుతుంది: కలెక్టర్

వందేమాతరం జాతీయగీతం దేశ సమైక్యతకు తోడ్పడుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం విద్యార్థులతో కలిసి సామూహిక వందేమాతరం గేయం ఆలపించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.


