News March 20, 2025

జనగామలో ఒక్క రోజు దీక్షను జయప్రదం చేయాలని పిలుపు

image

జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ.. మార్చి 21న జనగామ చౌరస్తాలో నిర్వహించనున్న ఒక్క రోజు దీక్షను జయప్రదం చేయాలని కోరుతూ.. గౌడ సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో బుధవారం పాలకుర్తి చౌరస్తాలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొడిశెట్టి వెంకన్న గౌడ్, తండ రమేశ్ గౌడ్, పులి గణేశ్ గౌడ్, పోశాల వెంకన్న గౌడ్, మూల వెంకటేశ్వర్లు, యాకయ్య గౌడ్ తదితరులున్నారు.

Similar News

News March 21, 2025

హనుమకొండ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

image

✓ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ముందస్తు సమాచారం సేకరించాలి
✓ ACBకి చిక్కిన స్టేషన్ ఘనపూర్ సబ్ రిజిస్ట్రార్
✓ ముల్కనూరు: రోడ్డు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలు
✓ HNK: రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జైన వ్యక్తి మృతి
✓ HNK: అక్రమ రవాణాపై బస్టాండ్లో ఆర్టీసీ ప్రయాణికులకు అవగాహన
✓ ప్రమాదకరంగా మారిన చెట్లను తొలగించిన దామెర పోలీసులు

News March 21, 2025

పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి:కలెక్టర్ 

image

రేపటి నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. పది పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితానికి మైలురాయి అని, దీన్ని అధిగమించడానికి మీరు ఎంత దృఢంగా నిలబడతారో తదుపరి ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.

News March 21, 2025

CMను కలిసిన అనంత దళిత ఎమ్మెల్యేలు

image

అమరావతిలో సీఎం చంద్రబాబును శింగనమల, మడకశిర ఎమ్మెల్యేలు బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. దళితులందరికీ సమాన న్యాయం చేకూరాలనే ఉక్కు సంకల్పంతో చంద్రబాబు గతంలో చూపిన చొరవకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికి దళిత శాసనసభ్యులందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

error: Content is protected !!