News March 20, 2025

సంతమాగులూరు: ఆర్టీసీ బస్సులో మహిళ మృతి

image

ఆర్టీసీ బస్సులో మహిళ మృతి చెందిన ఘటన సంతమాగులూరు మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టావారి పాలెం గ్రామానికి చెందిన షాహినా బేగం(68) అనే వృద్ధురాలు హైదరాబాదు నుంచి ఒంగోలుకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. దీంతో ప్రయాణికులు 108కి సమాచారం ఇవ్వగా, అప్పటికే మృతి చెందిందని వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 21, 2025

మాచవరంలో మహిళ దారుణ హత్య

image

మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పని చేస్తున్న సీతారత్నం (61) ను అతి దారుణంగా కొట్టడంతో తలకు తీవ్రమైన గాయమై మృతి చెందింది. మాచవరం PHCలో పనిచేస్తున్న సూపర్‌వైజర్ శ్రీనివాసరావుకు సీతారత్నంకు కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. డబ్బులు విషయంలో వీరిద్దరి మధ్య గొడవ కావడంతో ఈ హత్య జరిగినట్లు పిడుగురాళ్ల సీఐ వెంకటరావు తెలిపారు.

News March 21, 2025

కాకినాడ-లింగంపల్లి మధ్య రెండు స్పెషల్ రైళ్లు

image

కాకినాడ- లింగంపల్లి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 2 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. లింగంపల్లి నుంచి కాకినాడకు ఏప్రిల్ 3 నుంచి జులై 1వరకు మంగళ, గురు, శనివారాల్లో నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

News March 21, 2025

కైకలూరు: అత్త చేతి వేళ్లను రక్తం వచ్చేలా కరిచిన అల్లుడు

image

పిల్లనిచ్చిన అత్త చేతి వేళ్లను అల్లుడు రక్తం వచ్చేలా కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై ఎస్ఐ వెంకటేశ్వరరావు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. జంగం తిరుపతమ్మ (45) మార్చి 19న అల్లుడు బందెల జోజి బాబు ఇంటికి వెళ్ళారు. తన కూతురిని ఇంటికి పంపించాలని అల్లుడిని అత్త కోరగా, కోపంతో ఊగిపోయిన అల్లుడు అత్త చేతి వేళ్లను కొరికి గాయపరిచాడు. ఘటనపై ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

error: Content is protected !!