News March 20, 2025
రాష్ట్రంలోనే జమ్మికుంట, హుజూరాబాద్ టాప్

ఇంటిపన్ను వసూళ్లలో హుజూరాబాద్ మున్సిపాలిటీ 100 శాతం లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీ 100% లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ అయాజ్ పేర్కొన్నారు. ఈ ఘనత మున్సిపల్ ప్రజలు, సిబ్బంది వల్లే సాధ్యమైందని ఇరువురు తెలిపారు.
Similar News
News March 22, 2025
అడ్వకేట్లు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు: మంత్రి శ్రీధర్ బాబు

TG: రాష్ట్రంలో నూతన కోర్టు భవనాల నిర్మాణాలకు రూ.1000 కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ‘అడ్వకేట్లు, గుమాస్తాల సంక్షేమ చట్టం సవరణ బిల్లు-2025’ను శాసనమండలిలో ప్రవేశపెట్టారు. నూతన హైకోర్టుతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాల నిర్మాణానికి రూ.2,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. అడ్వకేట్లు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులతో పాటు ప్రమాద బీమా కల్పిస్తామని చెప్పారు.
News March 22, 2025
పూడిచెర్లలో ఫారంపాండ్ నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ

పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామ పరిధిలో ఉన్న రైతు సూరా రాజన్న పొలంలో ఫారం పాండ్ నిర్మాణ పనులకు శనివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భూమి పూజ చేసి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓర్వకల్లు నుంచే 1.55 లక్షల ఫారంపాండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాగా, వేదికపైకి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
News March 22, 2025
కడప: ‘వైసీపీ నేత రూ.2 కోట్ల భూమి కబ్జా చేశాడు’

కడప జిల్లా ఒంటిమిట్ట మండలానికి చెందిన వైసీపీ నేత రూ.2 కోట్ల భూమి కబ్జా చేశాడని టీడీపీ నేత ఆలూరి నరసింహులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తమాధవరం మాజీ సర్పంచ్ ఫేక్ డాక్యుమెంట్లతో రూ.2 కోట్ల విలువైన భూమిని ఆక్రమించి, అక్కడ హోటల్ కడుతున్నాడని ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని శుక్రవారం ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో, అలాగే మంత్రిని కలిసి ఫిర్యాదు చేశాడు.