News March 20, 2025
అనంతపురంలో యువతి ఆత్మహత్య

అనంతపురంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన మైథిలి అనే యువతి బుధవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 10న మైథిలి రసాయన ద్రావణం తాగి ఆత్మహత్యకు యత్నించింది. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 22, 2025
పెద్దపల్లి: ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు యువకుడు బలి

ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి(D) మంథని(M) విలోచవరానికు చెందిన కొరవేన సాయితేజ(26) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుని KNRలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్లో దశలవారీగా రూ.10లక్షలు పోగొట్టుకున్నాడని, అప్పులు తీర్చే దారిలేక ఈ నెల 18న ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడని పేర్కొన్నారు.
News March 22, 2025
ఆరో తరం ఫైటర్ జెట్పై అమెరికా చూపు

ఓవైపు ప్రపంచదేశాలు ఐదో తరం ఫైటర్ జెట్ గురించి ఆలోచిస్తుంటే అమెరికా ఆరో తరంపై దృష్టి సారించింది. అత్యాధునిక యుద్ధవిమానాన్ని రూపొందించే బాధ్యతను ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ బోయింగ్కు అప్పగించారు. ‘ప్రపంచంలో మరే విమానం కూడా దరిదాపుల్లోకి రాని విధంగా మా ఫైటర్ జెట్ ఉంటుంది. దాన్ని ఎఫ్-47గా పిలుస్తున్నాం. ఇప్పటికే ఐదేళ్లుగా దాని ప్రయోగాత్మక వెర్షన్ను రహస్యంగా పరీక్షిస్తున్నాం’ అని వెల్లడించారు.
News March 22, 2025
బాపట్ల: పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్.!

మూత్రవిసర్జన ముసుగులో రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. కొత్తపేట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. బాపట్ల ఎస్కార్ట్ పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అనే ఖైదీని చెరుకుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జైలు నుంచి తెనాలి కోర్టులో హాజరుపర్చారు. తిరుగు ప్రయాణంలో గుంటూరు బస్టాండ్లో మూత్రవిసర్జన కోసం వెళ్లి ఖైదీ తిరిగి రాలేదు. దీంతో కొత్తపేటలో ఫిర్యాదు చేశారు.