News March 20, 2025

నాగర్‌కర్నూల్: 26 రోజులైనా ఆచూకీ లేదు

image

SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారంతో 26 రోజులైనా కార్మికుల ఆచూకీ లభించలేదు. కేరళకు చెందిన కడావర్ డాగ్స్ గుర్తించిన D1, D2 ఏరియాల్లో ఆయా బృందాలు పనిచేస్తున్నాయి. TBM మిషన్ భాగాలు కత్తిరించి టన్నెల్ నుంచి బయటకు తీసుకొస్తున్నారు. సాంకేతిక కారణాలతో వారం రోజులుగా రోబోల సేవలు అందుబాటులోకి రాలేదు. అడ్డుగా ఉన్న టీబీఎం శకలాలను తొలిగిస్తేనే రోబో సేవలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.

Similar News

News November 6, 2025

ధాన్యం అమ్మిన రోజే అకౌంట్లలో డబ్బులు జమ

image

AP: ధాన్యం అమ్మిన రైతులకు అదేరోజు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసేలా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీని కోసం 35 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. రోజూ నాలుగుసార్లు.. అంటే మధ్యాహ్నం 12 గంటలకు, 2 గంటలకు, సాయంత్రం 4, 7 గంటలకు రైతుల ఖాతాల్లో డబ్బులు పంపించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సెలవు రోజుల్లో పేమెంట్‌ గేట్‌వే పనిచేయదు కనుక, ఆ డబ్బులు మరుసటి రోజు జమ అవుతాయన్నారు.

News November 6, 2025

పెద్దపల్లి: ‘నవంబర్ 20లోగా దరఖాస్తులు చేసుకోవాలి’

image

పెద్దపల్లి జిల్లాలో విశిష్ట ప్రతిభ కనబరిచిన దివ్యాంగులు, దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు రాష్ట్రీయ దివ్యాంగుల సాధికారత అవార్డు-2025 కోసం ఈనెల 20లోగా wdsc.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేయాలని పెద్దపల్లి జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ రావు సూచించారు. ఎంపికైన వారికి అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం-2025 సందర్భంగా అవార్డులు అందజేయనున్నారు. వివరాలకు 9440852495కు కాల్ చేయాలి.

News November 6, 2025

నిర్మల్: త్వరలో ఈ పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ సేవలు

image

నిర్మల్ డిపో నుంచి వివిధ దేవాలయాల యాత్రలకు త్వరలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని డిపో మేనేజర్ పండరి తెలిపారు. పండరి పూర్, తుల్జాపూర్, కొలహాపూర్, భద్రాచలం, సింహచలం, అన్నవరం రామేశ్వరం, శ్రీరంగం, కంచీపురం, అరుణాచలం, శబరిమలై నడపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీని ఆధారించాలని ఆయన కోరారు.