News March 20, 2025

నాగర్‌కర్నూల్: 26 రోజులైనా ఆచూకీ లేదు

image

SLBC టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారంతో 26 రోజులైనా కార్మికుల ఆచూకీ లభించలేదు. కేరళకు చెందిన కడావర్ డాగ్స్ గుర్తించిన D1, D2 ఏరియాల్లో ఆయా బృందాలు పనిచేస్తున్నాయి. TBM మిషన్ భాగాలు కత్తిరించి టన్నెల్ నుంచి బయటకు తీసుకొస్తున్నారు. సాంకేతిక కారణాలతో వారం రోజులుగా రోబోల సేవలు అందుబాటులోకి రాలేదు. అడ్డుగా ఉన్న టీబీఎం శకలాలను తొలిగిస్తేనే రోబో సేవలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు.

Similar News

News March 21, 2025

జమ్మికుంట: శ్రీశైలం డ్యామ్‌లో పడి విద్యార్థి మృతి

image

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సాగర్ల సాయి తేజ (19) తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఏపీలోని శ్రీశైలం వెళ్లాడు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్కడ జలాశయంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. కాగా సాయితేజ HYDలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాయితేజ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 21, 2025

HYDలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

image

హజ్రత్ అలీ వర్ధంతి సందర్భంగా నేడు చార్మినార్ నుంచి మస్జిద్-ఇ-ఇమామియా వరకు జరిగే ఊరేగింపు కారణంగా మ. 2:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని HYD ట్రాఫిక్ జాయింట్ సీపీ తెలిపారు. నయాపూల్, చట్టాబజార్, పురాణిహవేలి, దారులషిఫా గ్రౌండ్స్, ఎస్జే రోటరీ, దబీర్‌పురా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ప్రయాణికులు ట్రాఫిక్ అప్డేట్స్‌ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలని సూచించారు.

News March 21, 2025

జమ్మికుంట: శ్రీశైలం డ్యామ్‌లో పడి విద్యార్థి మృతి

image

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సాగర్ల సాయి తేజ (19) తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఏపీలోని శ్రీశైలం వెళ్లాడు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్కడ జలాశయంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. కాగా సాయితేజ HYDలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాయితేజ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!