News March 20, 2025

మహబూబాబాద్ మార్కెట్‌కు పోటెత్తిన ఎర్రబంగారం

image

మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి పోటెత్తింది. బుధవారం తేజ, తాలు రకం కలిపి 6,727 బస్తాల మిర్చి విక్రయాలు జరిగాయి. తేజ రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.13,639, కనిష్ఠ ధర రూ.9,500 తాలు రకం క్వింటాకు గరిష్ఠ ధర రూ.6,350, కనిష్ఠ ధర రూ.5,020 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు.

Similar News

News March 21, 2025

ఉదయాన్నే వేడి నీరు తాగుతున్నారా?

image

నిద్ర లేవగానే చాలా మంది నీళ్లు తాగుతుంటారు. అయితే బరువు తగ్గడం కోసం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా వేడి నీరు తీసుకుంటే దంత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే టేస్ట్ బడ్స్ కూడా దెబ్బతిని ఆహార పదార్థాల రుచి తెలియకుండా పోతుంది. జీర్ణ వ్యవస్థనూ ఇబ్బంది పెట్టి కడుపునొప్పికి కారణమవుతుంది. గోరు వెచ్చని నీరు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

News March 21, 2025

ప్రకాశం: ఆ పాఠశాలలు మధ్యాహ్నం ప్రారంభం.!

image

ప్రకాశం జిల్లాలో టెన్త్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలలో మధ్యాహ్నం 1:30 గంటల నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఉన్నత విద్యాశాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు 1:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత యాజమాన్యాలు పాఠశాలలను నిర్వహించాలన్నారు. టెన్త్ క్లాస్ పరీక్ష లేనిరోజు కూడా మధ్యాహ్నం సమయంలోనే పాఠశాలలను నిర్వహించాలని పేర్కొన్నారు.

News March 21, 2025

NLG: విద్యార్థుల్లారా.. విజయీభవ..!

image

జిల్లాలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 18,925 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కాగా టెన్త్ క్లాస్ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకుని పరీక్షలు ప్రశాంతంగా రాయాలన్నారు.

error: Content is protected !!