News March 20, 2025
యూనివర్సిటీకి బడ్జెట్లో నిధులు ఎంతంటే.?

వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి రూ.50కోట్లు, జీతభత్యాలకు రూ.145.62కోట్లు కేటాయించింది. గత ఏడాది బడ్జెట్లో జీతభత్యాలకు రూ.135కోట్లు, రూ.500కోట్లు ప్రతిపాదించగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ బడ్జెట్లో ప్రవేశ పెట్టిన నిధులను యూనివర్సిటీకి ఖర్చు చేస్తారో, లేదో.. వేచి చూడాలి.
Similar News
News October 28, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షపాతం వివరాలు ఇవే

పార్వతీపురం మన్యం జిల్లాలో 24గంటల్లో 438.5mm వర్షపాతం నమోదైనట్లు అధికారులు మంగళవారం తెలిపారు. అత్యధికంగా సీతంపేట 49mm, అత్యల్పంగా జిఎం వలస11.5mm, గరుగుబిల్లి 48.8mm, పాలకొండ32.6mm వర్షం పడిందన్నారు. భామిని37.8mm, వీరఘట్టం 29.6mm,గుమ్మలక్ష్మీపురం 14.2mm, కొమరాడ -15.2mm, కురుపాం-12.4mm,పాచిపెంట 42.4mm,సాలూరు22.4mm, పార్వతీపురం-25.6mm,మక్కువ 25.4mm, సీతానగరం 28.00mm,బలిజిపేట-44.2mm నమోదయ్యిందన్నారు.
News October 28, 2025
భారతదేశపు మొదటి మహిళా స్టంట్ ఉమన్

హీరోయిన్లకు యాక్షన్ సీన్లుంటే వాటికోసం స్టంట్ ఉమన్లు ఉంటారు. కానీ 50ఏళ్ల క్రితం ఓ మహిళ ఇలా స్టంట్లు చేసిందంటే నమ్ముతారా? ఆమే భారతదేశపు మొదటి మహిళా స్టంట్ ఉమన్ రేష్మా పఠాన్. ఐదు దశాబ్దాల కెరీర్లో 400 కి పైగా చిత్రాల్లో ఆమె స్టంట్లు చేశారు. షోలే సినిమా తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసింది. ఆమె సేవలకుగాను ‘ఫిలిం క్రిటిక్స్ గిల్డ్’ రేష్మాను ఫస్ట్ క్రిటిక్స్ ఛాయిస్ ఫిలిం అవార్డుతో సత్కరించింది.
News October 28, 2025
NLG: కొనుగోలు కేంద్రాలు సరే.. స్థలమేదీ..!

నల్గొండ జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. కోసిన ధాన్యం ఎక్కడ ఆరబెట్టాలో తెలియక రైతులు సతమతం అవుతున్నారు. కొనుగోలు కేంద్రాలకూ సరిపడా స్థలం లేదు. పది నుంచి 20 రాశులు రాగానే స్థలం కొరత ఏర్పడుతోంది. ధాన్యం సేకరణకు జిల్లాలో ఇప్పటికే 85% ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో కేవలం కొన్ని కేంద్రాలకే అనువైన స్థలాలు ఉన్నాయి. మిగతా కేంద్రాలకు సరైన స్థలాలే లేవని రైతులు అంటున్నారు.


