News March 20, 2025

అమరావతిలో వివిధ కంపెనీలకు భూ కేటాయింపులు

image

AP: GMO సిఫార్సులతో అమరావతిలో పలు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది.
* బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్‌కు 70 ఎకరాలు
* IT టవర్ నిర్మాణానికి L&Tకి 10 ఎకరాలు
* ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు 25 ఎకరాలు
* హడ్కో హ్యాబిటేట్ సెంటర్‌కు 8 ఎకరాలు
* ఆస్పత్రి, మెడి‌కల్ కాలేజీ నిర్మాణం కోసం భూకేటాయింపు
* బడ్జెట్ హోటల్‌కు స్థలం కేటాయించాలని IRCTC ప్రతిపాదన

Similar News

News March 21, 2025

IPL: లక్నోకు ఆల్‌రౌండర్!

image

రేపు ఐపీఎల్-2025 ప్రారంభం కానుండగా పలు జట్లలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. బౌలర్ మోహ్సిన్ ఖాన్ స్థానంలో ఆయనను తీసుకున్నట్లు తెలిపాయి. సీఎస్కే, కేకేఆర్ వంటి జట్లకు ఆడిన శార్దూల్ వేలంలో అమ్ముడుపోలేదు. తర్వాత జరిగిన దేశవాళి టోర్నీల్లో సత్తా చాటారు.

News March 21, 2025

‘ఎల్లమ్మ’ సినిమాలో కీర్తి సురేశ్?

image

‘బలగం’ డైరెక్టర్ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కనున్న ‘ఎల్లమ్మ’ మూవీ షూటింగ్ మేలో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ నటించే అవకాశాలున్నాయి. తాజాగా ఆమెకు డైరెక్టర్ స్టోరీ చెప్పినట్లు సమాచారం. దీనికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. తొలుత సాయిపల్లవిని తీసుకోవాలనుకున్నారని, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

News March 21, 2025

ఓటీటీలోకి వచ్చేసిన రెండు సినిమాలు

image

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్స్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’, జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రదీప్ రంగనాథన్, అనుపమ, కయాదు లోహర్ నటించిన ‘డ్రాగన్’ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక ధనుశ్ దర్శకుడిగా తెరకెక్కించిన జాబిలమ్మ నీకు అంత కోపమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రెండు చిత్రాలు థియేటర్లలో హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

error: Content is protected !!