News March 20, 2025

కృష్ణా జిల్లాలో ఇద్దరు ఇన్విజిలేటర్లు సస్పెండ్ 

image

పదో తరగతి పరీక్షల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తాడిగడప ఎంపీపీ ఎస్ మెయిన్ పాఠశాల ఇన్విజిలేటర్‌‌ను డీఈవో రామారావు సస్పెండ్ చేశారు. గైర్హాజరైన విద్యార్థి స్థానంలో మరొకరు పరీక్ష రాయడాన్ని గమనించకుండా బాధ్యతా రహితంగా వ్యవహరించడంతో ఈ చర్య తీసుకున్నారు. కంకిపాడులో ప్రశ్నపత్రం మార్పిడి ఘటనలో మరో ఇన్విజిలేటర్‌ను కూడా సస్పెండ్ చేశారు.

Similar News

News September 11, 2025

కృష్ణా: ఒకేసారి 15 మందికి గవర్నమెంట్ జాబ్స్

image

కోడూరు మండలం జరుగువానిపాలెం గ్రామం ఆదర్శంగా నిలిచింది. చిన్న పల్లెటూరు నుంచి ఒకేసారి 15 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిలో 8 మంది అమ్మాయిలు, 7 మంది అబ్బాయిలు. ఇటీవల విడుదలైన డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో వీరు అర్హత సాధించారు. 11 టీచర్ పోస్టులు, 3 పోలీస్ ఉద్యోగాలు, ఒకరు సేల్స్ ట్యాక్స్‌లో నియామకం పొందారు.

News September 11, 2025

గరికపాడులో జిల్లా జూడో జట్ల ఎంపిక

image

తోట్లవల్లూరు మండలం గరికపాడు ప్రభుత్వ పాఠశాలలో అండర్-14, 17 జూడో జట్ల ఎంపికలు ఘనంగా జరిగాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు దుర్గారావు, శ్రీలత తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు కీర్తి తీసుకురావాలని వారు క్రీడాకారులను కోరారు.

News September 11, 2025

మచిలీపట్నం-విజయవాడ రహదారిపై ప్రమాదం.. స్పాట్ డెడ్

image

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వెంటనే 108 అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.