News March 20, 2025

SLBCకి రూ.900 కోట్లు.. డిండికి రూ.400 కోట్లు

image

సాగునీటి పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు రూ.900 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అలాగే డిండి ఎత్తిపోతల పథకానికి గతేడాది రూ.300 కేటాయించిన ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.400 కోట్లకు పెంచింది. దీంతో డిండి ఎత్తిపోతల పథకం పనుల్లో వేగం పెరిగే అవకాశం ఉంది.

Similar News

News October 30, 2025

నల్గొండ: మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ

image

నల్గొండ శివారు రాంనగర్‌లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు మగ్గం వర్క్‌లో 31 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజనం కల్పిస్తామన్నారు. 18 సం. నుంచి 45 లోపు ఉమ్మడి నల్గొండకు చెందిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు నవంబర్ 3 లోపు అప్లై చేసుకోవాలన్నారు.

News October 30, 2025

NLG: అందరిదీ అదే పరిస్థితి.. ఆలోచన విధానం మారితేనే మంచిది!

image

శాలిగౌరారం (M) పెర్కకొండారంకు చెందిన బలరాం అనే రైతు 10 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. రూ.4లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇప్పటి వరకు ఆయనకు 15 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. అంటే సుమారు 3 లక్షలు నష్టపోయాడు. పత్తి సాగు చేస్తే లాభాలు గడించొచ్చని అనుకున్నారు. కానీ తీరా చూస్తే నష్టాలే మిగిలాయి. అతనొక్కడిదే కాదు దాదాపు అందరిదీ ఇదే పరిస్థితి. రైతులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరముంది.

News October 30, 2025

NLG: డీసీసీల ఎంపిక మరింత ఆలస్యం..?

image

డీసీసీల ఎంపిక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే డీసీసీల ఎంపిక చేయనున్నట్లు సమాచారం. నేతల మధ్య అంతర్గత పోరు, జిల్లాలో నాయకుల మధ్య సఖ్యత కనిపించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కనీసం రెండు నెలలు సమయం పట్టొచ్చని ఏఐసీసీ వర్గాల సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు డీసీసీల్లో ఒకటి ఓసీ, మిగతా రెండు ఎస్సీ, బీసీకి కేటాయించే అవకాశాలున్నట్లు సమాచారం.