News March 20, 2025

సంగారెడ్డి: ‘పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్‌లు బంద్’ 

image

జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్‌లను మూసివేయాలని జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా జరిగేందుకు పరీక్ష కేంద్రాల సిబ్బంది అందరూ కృషి చేయాలని కోరారు.

Similar News

News March 23, 2025

కల్వకుర్తి: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

image

కల్వకుర్తి ఈనెల 25న తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి రాపోతు అనిల్ గౌడ్ పేర్కొన్నారు. పట్టణంలోని సీకేఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే జాబ్ మేళాలో 50కి పైగా కంపెనీలు 5వేల ఉద్యోగాలు కల్పించనున్నాయని ఆయన పేర్కొన్నారు.

News March 23, 2025

పైరవీలు లేకుండా, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: భట్టి

image

TG: రాజీవ్ యువ వికాసం పథకానికి లబ్ధిదారులను పైరవీలు లేకుండా, పారదర్శకంగా ఎంపిక చేయాలని అధికారులను Dy.CM భట్టి విక్రమార్క ఆదేశించారు. APR 5లోగా దరఖాస్తులు స్వీకరించి, APR 6 నుంచి మండల స్థాయిలో స్క్రూటినీ, ఆ తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అప్రూవల్ వచ్చాక లబ్ధిదారులను ప్రకటించాలన్నారు. JUNE 2 నుంచి మంజూరు పత్రాలు అందజేస్తామని చెప్పారు.

News March 23, 2025

నిజామాబాదులో వ్యక్తి దారుణ హత్య

image

వేల్పూర్ మండలం పచ్చలనడ్కడలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడు మహారాష్ట్రకు చెందిన శంకర్‌గా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన శంకర్, బాలాజీ ఇద్దరు నెల రోజుల నుంచి గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కూలి పని చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఇరువురు గొడవ పడ్డారు. అనంతరం బాలాజీ కనపడ లేదు. శనివారం దుర్వాసన రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సంజీవ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!