News March 24, 2024
రెండో పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు
భర్త చనిపోయిన చాలామంది ఆడవాళ్లు రెండో పెళ్లికి అయిష్టంగా ఉంటారు. అలాంటి మహిళలకు భరోసా ఇచ్చేందుకు ఝార్ఖండ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ‘విధ్వ పునర్వివాహ్ ప్రోత్సాహన్ యోజన’ పేరుతో రెండో పెళ్లి చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. రెండో పెళ్లి సర్టిఫికెట్తో పాటు చనిపోయిన భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే.. వారి ఖాతాలో నగదు జమ చేస్తోంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లు తీసుకునేవారికి వర్తించదు.
Similar News
News October 3, 2024
సీఎం రేవంత్పై ఆరోపణలు.. కేటీఆర్పై ఫిర్యాదు
TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై TPCC మీడియా, కమ్యూనికేషన్స్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి వనస్థలిపురం పీఎస్లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ అధిష్ఠానంపై KTR తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మూసీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ ₹1,50,000 కోట్లను ప్రకటించారని, ఇందులో ₹25,000 కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచిపెట్టేందుకేనని KTR ఆరోపించిన సంగతి తెలిసిందే.
News October 3, 2024
మండే ఎండలు.. భారీ వర్షాలు
APలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓవైపు వర్షాలు కురుస్తుండగా మరోవైపు ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న నెల్లూరులో 40.7 డిగ్రీలు, కావలిలో 39.8, అనంతపురంలో 38.9, తిరుపతిలో 37.6 అమరావతిలో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇవాళ ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
News October 3, 2024
పెట్రోల్ ధరల పెంపు?
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరిగాయి. 71 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర 2.7% పెరిగి 75 డాలర్లకు చేరింది. ప్రపంచంలో మూడో వంతు దేశాలకు ప్రస్తుతం ఇరాన్ నుంచే ఆయిల్ సప్లై అవుతోంది. ముడిచమురు ధరలకు అనుగుణంగానే మన దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేస్తున్నాయి. ఫలితంగా పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.