News March 20, 2025
సూర్యాపేట: 90 వేల మంది రైతులకు జమ కానున్న డబ్బులు

రైతు భరోసాకు ఈ బడ్జెట్లో రూ.18 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటికే మూడు ఎకరాలలోపు ఉన్న 1.50 లక్షల మంది రైతులకు ఈ నిధులు అందాయి. ఇక మిగిలిన 90వేల మంది రైతులకు డబ్బులు త్వరలోనే వారి ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతుల కష్టాలు త్వరలో తీరనున్నాయి.
Similar News
News February 25, 2026
NGKL: ఇంటర్మీడియట్ పరీక్షలకు 6,989 మంది హాజరు

రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి.Telangana State Board of Intermediate Education ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి రోజు పరీక్షలకు మొత్తం7,265 మంది విద్యార్థులు కేటాయించగా,6,989మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,565 మందికి గాను 5,387 మంది, వొకేషనల్ విభాగంలో 1,700మందికి గాను 1,602మంది పరీక్షలకు హాజరైనట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ వెల్లడించారు.
News February 25, 2026
నెల్లూరు: 27న ట్రై స్కూటీల కోసం ఇంటర్వ్యూలు

ఈనెల 27న ట్రై స్కూటీల మంజూరుకు విభిన్న ప్రతిభావంతులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా మేనేజర్ మహమ్మద్ అయూబ్ తెలిపారు. జిల్లాలో ట్రై స్కూటర్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను దరఖాస్తు సమయంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. నెల్లూరులోని JC ఛాంబర్లో ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
News February 25, 2026
జడ్చర్ల: అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నాపత్రం తారుమారు

జడ్చర్ల పట్టణంలోని ఓ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంలో విద్యార్థికి సంస్కృతం సబ్జెక్టు పేపర్కు బదులుగా హిందీ ప్రశ్నాపత్రాన్ని అందజేశారు. పరీక్ష తొందరలో విద్యార్థి తనకు తోచిన జవాబులు రాశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి కళాశాలకు వెళ్లి అధికారులను ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


