News March 20, 2025
మహబూబ్నగర్లో కానిస్టేబుల్ సూసైడ్

మహబూబ్నగర్లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News November 3, 2025
యాదాద్రి: కార్తీక దీపోత్సవంలో కలెక్టర్ దంపతులు

యాదగిరిగుట్ట కొండపై ఉన్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సాయంత్రం దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు దంపతులు పాల్గొని దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
News November 3, 2025
వరంగల్ పరిధిలో 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 41 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇందులో 37 మంది మద్యం తాగి వాహనాలు నడపగా, మరో నలుగురు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడ్డారని ఇన్స్పెక్టర్ సుజాత తెలిపారు. ఈ కేసులపై కోర్టు జరిమానాలు విధించినట్లు, మద్యం సేవించి వాహనం నడపడం చట్టారీత్యా నేరమని హెచ్చరించారు.
News November 3, 2025
దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి: భూపాలపల్లి కలెక్టర్

జిల్లాలో ప్రజావాణిలో వచ్చిన సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి 44 ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను సమయానికి పరిష్కరించడం అన్ని శాఖల బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.


