News March 20, 2025

నిర్మల్: ఆ గురువులే కీచకులు

image

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల కీచకంగా మారుతున్నారు. నిర్మల్(D) నర్సాపూర్ (జి)లో గణిత ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి అరెస్టు అయ్యాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జడ్పీ స్కూల్, సాయికుంట ఆశ్రమ పాఠశాల, భీమిని పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

Similar News

News January 10, 2026

జంగా కృష్ణమూర్తికి CM చంద్రబాబు ఫోన్!

image

AP: పల్నాడు నేత జంగా కృష్ణమూర్తి నిన్న TTD బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో CM CBN ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. దీంతో జంగా ఇవాళ లేదా రేపు CMను కలవనున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్పాయి. కాగా తిరుమలలో అతిథి గృహం నిర్మించడానికి తనకు స్థలం కేటాయింపు పునరుద్ధరణపై ఓ పత్రికలో కథనాలు వచ్చాయని జంగా పేర్కొన్నారు. దీనిపై మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

News January 10, 2026

ప్రకాశం జిల్లాలో 11 మందికి పదోన్నతి

image

ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం పరిధిలోని వివిధ కార్యాలయాల్లో పని చేస్తున్న 11 మంది సీనియర్ సహాయకులకు పదోన్నతి కల్పించారు. ఆ ఉత్తర్వులను జెడ్పీ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వారికి అందజేశారు. పదోన్నతి పొందిన వారిలో జి. సుగుణశోభారాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం.శ్రీవాణిని ఒంగోలు జెడ్పీకి, ఎం. ఇందిరను మర్రిపూడి ఎంపీపీ, డి. ఖాసీంపీరాను బేస్తవారిపేట ఎంపీపీకి కేటాయించారు.

News January 10, 2026

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.1,150 పెరిగి రూ.1,40,460కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,050 ఎగబాకి రూ.1,28,750 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.7వేలు పెరిగి రూ.2,75,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.