News March 20, 2025
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి..

కర్లపాలెం మండలం యాజలికి చెందిన ప్రవీణ్ కుమార్(15) ఈతకు వెళ్లి బుధవారం మృతి చెందాడు. ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. యాజలిలోని పంట పొలాల్లో 20 అడుగుల లోతు ఉన్న ఓ గుంతలో ఈత కొట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలిపారు. మరో ఘటనలో పిట్టలవానిపాలెం మండలం గోకరాజునల్లి బోయినవారిపాలెంలో విద్యుత్ షాక్ తగిలి కలుసు బేబీ(6) అనే బాలిక మృతి చెందింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Similar News
News March 21, 2025
జడ్జి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు.. నెక్స్ట్ ఏంటి?

ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా నగదు బయటపడింది. ఇది లెక్కల్లో చూపని డబ్బు కావడంతో సుప్రీంకోర్టు కొలీజియం ఆగ్రహించింది. ఈ ఘటన న్యాయ వ్యవస్థను దెబ్బతీస్తుందని, వర్మ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఆయనను ఢిల్లీ నుంచి అలహాబాద్కు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ ఘటనపై వర్మ నుంచి CJI వివరణ కోరనున్నారు. ఆ వివరణతో సంతృప్తి చెందకపోతే అంతర్గత విచారణకు ఆదేశిస్తారు.
News March 21, 2025
NLG: అతడు అడవిని సృష్టించాడు!

ఎకరం పొలం ఉంటేనే ఏ పంట వేద్దాం, కౌలుకు ఇస్తే ఎంతొస్తది? అని లెక్కలేసుకునే రోజులివి. కానీ, హైవేకు ఆనుకొని ఉన్న 70 ఎకరాల భూమిలో మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారో ప్రకృతి ప్రేమికుడు. రూ.కోట్ల విలువ చేసే భూమిని అడవిగా మార్చేశారు. ఒక్కరోజులో జరిగిన పరిణామం కాదు. ఏకంగా 60 ఏళ్లు శ్రమించి 5 కోట్ల వరకు వృక్షాలను పెంచి ఆదర్శంగా నిలిచారు. ఆయనే మన రాఘవాపురం దుశ్చర్ల సత్యనారాయణ.
నేడు International Forest Day
News March 21, 2025
కడప MP అవినాశ్కి కీలక బాధ్యత.!

పార్లమెంట్ ఎస్టిమేట్ (అంచనాల) కమిటీ సభ్యునిగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ అంచనాల కమిటీ పార్లమెంటులో అత్యున్నతమైన కమిటీ. దేశం మొత్తం మీద 543 పార్లమెంట్ సభ్యుల నుంచి 30 మందిని ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా.. వైఎస్సార్సీపీ నుంచి కడప జిల్లా పార్లమెంట్ సభ్యులు YS అవినాశ్ రెడ్డి ఎన్నికవ్వడం చాలా సంతోషమని కార్యకర్తలు తెలిపారు.