News March 20, 2025
యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి

TG: సూర్యాపేట (D) హుజూర్నగర్లో ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హుజూర్నగర్కు చెందిన రోజా తన స్నేహితురాలి(26)ని ఇంటికి పిలిచింది. ఆపై మద్యం తాగించి మత్తులోకి వెళ్లాక రోజా ప్రియుడు ప్రమోద్ ఆ యువతిపై అత్యాచారం చేయగా ఆమె వీడియో తీసింది. బుధవారం మరోసారి ఆ యువతికి ఫోన్ చేసి పిలిపించారు. ఈ సారి తన ఫ్రెండ్ హరీశ్ కోరిక తీర్చాలని ప్రమోద్ కోరగా ఆమె నిరాకరించి పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News March 21, 2025
GST: 12% శ్లాబ్రేట్ రద్దుకోసం రంగంలోకి నిర్మల

GSTలో 12% శ్లాబ్రేటు ఎత్తివేతపై ఏర్పాటైన ఆరుగురు సభ్యుల మంత్రుల బృందంతో FM నిర్మలా సీతారామన్ సమావేశం అవుతారని తెలిసింది. పన్ను వ్యవస్థను సింప్లిఫై చేసేందుకు ఈ శ్లాబును రద్దు చేయాలని ప్రయత్నిస్తున్న కేంద్రం GoMను నియమించింది. వీరిలో కొందరు దీనికి మద్దతు ఇస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఏకగ్రీవ నిర్ణయం కోసం నిర్మల వీరితో చర్చించనున్నారు. 12% శ్లాబ్ ద్వారా GOVTకి 5% ఆదాయమే వస్తోంది.
News March 21, 2025
Stock Markets: మీడియా, PSE షేర్ల దూకుడు

స్టాక్మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ 23,350 (+159), సెన్సెక్స్ 76,905 (+557) వద్ద ముగిశాయి. మీడియా, PSE, చమురు, CPSE, ఎనర్జీ, PSU బ్యాంకు, హెల్త్కేర్, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, ఇన్ఫ్రా, కమోడిటీస్, ఫైనాన్స్, బ్యాంకు, రియాల్టి, ఆటో షేర్లు అదరగొట్టాయి. మెటల్, వినియోగ షేర్లు ఎరుపెక్కాయి. SBI లైఫ్, ONGC, NTPC, BPCL, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్. ట్రెంట్, ఇన్ఫీ, విప్రో, హిందాల్కో టాప్ లూజర్స్.
News March 21, 2025
ఇక రచ్చే.. రేపే IPL ప్రారంభం

ధనాధన్ క్రికెట్ సంబరానికి సర్వం సిద్ధమైంది. రేపు IPL 18వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో KKR, RCB పోటీ పడనున్నాయి. మండు వేసవిలో రెండు నెలలపాటు సిక్సర్లు, ఫోర్ల వర్షంలో తడిసి మురిసేందుకు అభిమానులు రెడీ అయ్యారు. వారిని ఏ మాత్రం నిరాశపర్చకుండా పైసా వసూల్ వినోదాన్ని అందించేందుకు ఆటగాళ్లు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు. స్టార్స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో మ్యాచ్లను వీక్షించవచ్చు.