News March 20, 2025
జగిత్యాల: ఎస్సారెస్పీలో తగ్గుతున్న నీటి మట్టం

ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 22.564 టీఎంసీలకు చేరింది. యాసంగి పంటల సాగునీరు, తాగునీటి అవసరాలకు కాలువల ద్వారా విడుదల జరుగుతోంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1,447 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, కాకతీయ కాలువ ద్వారా 5,000, లక్ష్మి కెనాల్ ద్వారా 250, అలీసాగర్ లిఫ్ట్కు 540 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవి తెలిపారు.
Similar News
News March 21, 2025
ములుగు: పని పట్ల మంత్రి సీతక్క నిబద్ధత

ఎంతో పని ఒత్తిడి అసెంబ్లీ సమావేశాలున్నా శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నరకే ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయానికి మంత్రి సీతక్క చేరుకున్నారు. ఉదయం 9.45వరకు అధికారులతో జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, తాగు నీటి పంపిణిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం శాసన మండలికి చేరుకుని బడ్జెటపై జరిగిన చర్చలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.
News March 21, 2025
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు అదిరిపోయే న్యూస్

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా డబ్బింగ్ స్టార్ట్ అయినట్లు మూవీ యూనిట్ పేర్కొంది. సాటిలేని హీరోయిజం ప్రయాణం వెండి తెరకు మరింత చేరువైనట్లు పేర్కొంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రానికి కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించగా మిగతా భాగాన్ని తెరకెక్కించే బాధ్యత జ్యోతి కృష్ణ తీసుకున్నారు. కాగా ఈ మూవీ మే 9న థియేటర్లలో విడుదల కానుంది.
News March 21, 2025
పరీక్షా కేంద్రాలను సందర్శించిన DEO

జిల్లాలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సెయింట్ ఆర్నాల్డ్, ప్రభుత్వ బాలుర, బాలికల పాఠశాలలను సందర్శించారు. అనంతరం విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును పరీక్ష కేంద్రాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.