News March 20, 2025
వనపర్తి జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి.. !

వనపర్తి జిల్లాలో వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. బుధవారం అత్యధికంగా కనైపల్లిలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెబ్బేరు, విలియంకొండలో 39.3 డిగ్రీలు, వనపర్తి 39.1, మదనాపూర్, వెల్గొండ 39, ఆత్మకూరు 38.8, రేమద్దుల, పెద్దమండడి, దగడ 38.7, పాన్గల్ 38.6, గోపాలపేట, రేవల్లి 38.5, వీపనగండ్ల 38.3, ఘనపూర్ 38.1, సోలిపూర్ 38, శ్రీరంగాపురం 37.9, కేతేపల్లి 37.7, జానంపేట 37.5, అమరచింతలో 37.4 డిగ్రీలు నమోదైంది.
Similar News
News March 21, 2025
కశ్మీర్లో ఆ రోజులు పోయాయి: అమిత్ షా

కశ్మీర్లో ఉగ్రదాడులు తగ్గిపోయి, పరిస్థితులు మారిపోయాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆ రాష్ట్రంలోని సినిమా హాళ్లన్నీ నిండిపోతున్నాయని చెప్పారు. ‘యువకులు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఉగ్రవాదులకు సానుభూతిగా ఎలాంటి ఆందోళనలు చేయడం లేదు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్ను నాశనం చేశాయి. మేం కశ్మీర్ను విజయవంతంగా భారత్లో విలీనం చేశాం’ అని పేర్కొన్నారు.
News March 21, 2025
HYD: మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు నీటితొట్లు

మూగజీవాల పట్ల దయ కలిగి ఉండాలని ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందుమూల రజిత పరమేశ్వర్ రెడ్డి అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మూగజీవాల దాహార్తిని తీర్చేందుకై జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నీటి తొట్లను ఆమె ఇవాళ పరిశీలించారు. డిప్యూటీ వెటర్నరీ డైరెక్టర్ డాక్టర్ రంజిత్, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
News March 21, 2025
శ్రీసత్యసాయి: పది పరీక్షకు 111 మంది విద్యార్థుల గైర్హాజరు

శ్రీసత్యసాయి జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు 111 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 104 కేంద్రాలలో శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 104 మంది, ప్రైవేట్ విద్యార్థులు ఏడు మంది గైర్హాజరు అయినట్లు ఆయన పేర్కొన్నారు.