News March 20, 2025
హనుమకొండ: నేడు ప్రారంభం కానున్న పండ్ల మార్కెట్

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ముసలమ్మకుంట గోదాముల వద్ద ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ను గురువారం మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు ప్రారంభిస్తారని మార్కెట్ కార్యదర్శి గుగులోతు రెడ్యా తెలిపారు. ఈ మేరకు మామిడికాయల సీజన్ ప్రారంభమైనందున ముసలమ్మకులో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు.
Similar News
News January 8, 2026
కాకినాడ: కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

తొండంగి మండలం వాకదారిపేటలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో పలు ఔట్సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఏఎన్ఎం, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 11 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు, పూర్తి వివరాలకు MEO, DEO కార్యాలయాలను సంప్రదించలన్నారు.
News January 8, 2026
ప్రధాని మోదీ ఆస్తులు ఎంతంటే?

PM నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ.3.02 కోట్లకు చేరిందని ఏడీఆర్ (Association for Democratic Reforms) నివేదిక వెల్లడించింది. 2014తో పోలిస్తే పదేళ్లలో ఆయన ఆస్తులు 82% పెరిగాయి. ఇక లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్తులు 2014లో రూ.9.4 కోట్లుగా ఉండగా, 2024 నాటికి రూ.20.39 కోట్లకు చేరి 117% వృద్ధి నమోదైంది. వరుసగా 3 సార్లు గెలిచిన ఎంపీల సగటు ఆస్తులు కూడా పదేళ్లలో 110% పెరిగినట్లు ADR తెలిపింది.
News January 8, 2026
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<


