News March 20, 2025
మంచిర్యాల: యువతికి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు

మంచిర్యాలలోని రాంనగర్కు చెందిన బొడ్డు సంకీర్తన ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. 2023లో కానిస్టేబుల్ ఉద్యోగం.. ఆ తర్వాత గ్రూప్ 4, గత జనవరిలో జరిగిన సీడీపీఓ పరీక్షతో పాటు సూపర్వైజర్ గ్రేడ్-1లో రెండు ఉద్యోగాలు, బుధవారం టీజీపీఎస్సీ ప్రకటించిన ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (సూపర్ వైజర్) గ్రేడ్ 1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 2, మల్టీజోన్లో 1వ ర్యాంకు సాధించింది.
Similar News
News March 21, 2025
పకడ్బందీగా పది పరీక్షలు: ఎస్పీ

పదవ తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను ఆయన సందర్శించి బందోబస్తును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News March 21, 2025
యశ్వంత్ వర్మపై విచారణకు సుప్రీం ఆదేశం

ఢిల్లీ హైకోర్టు జడ్జి <<15834106>>యశ్వంత్ వర్మ<<>> ఇంట్లో భారీగా నగదు బయటపడిన వ్యవహారంపై సుప్రీం కోర్టు అంతర్గత విచారణకు ఆదేశించింది. హైకోర్టు సీజే నుంచి నివేదిక కోరింది. వర్మ నివాసంలో రూ.50కోట్ల వరకు నగదు బయటపడినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ డబ్బంతా ఎవరిదన్న కోణంలోనూ దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. కాగా వర్మపై ఇప్పటికే బదిలీ వేటు పడింది.
News March 21, 2025
ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

వేసవి నేపథ్యంలో ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన జ్వరం కలిగియుండటం, మత్తు నిద్ర కలవరింతలు, ఫిట్స్, లేదా పూర్తి అపస్మారక స్థితి ఉంటుందని, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తెలుపు రంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలని అన్నారు. తలకు టోపి పెట్టుకోవాలని, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోస్ కలిపిన నీటిని తాగాలని సూచించారు.