News March 20, 2025
సన్నబియ్యం పంపిణీ ఎప్పటినుంచంటే?

TG: ఈ ఉగాది నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇవ్వనుంది. ఇందుకోసం గోదాముల్లో సన్నబియ్యం సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇవి 4 నెలలకు సరిపోతాయని అంచనా. మొత్తం 91,19,268 రేషన్ కార్డులు ఉండగా 2,82,77,859 మంది లబ్ధిదారులు ఉన్నారు.
Similar News
News March 21, 2025
వివేకా హత్య కేసు.. రోజువారీ విచారణ కోరుతూ సునీత పిటిషన్

వివేకా హత్య కేసు విచారణపై ఆయన కుమార్తె సునీత TG హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. CBI కోర్టులో రోజూ విచారణ జరిగేలా ఆదేశించాలని కోరారు. ఈ కేసులో సీబీఐని ప్రతివాదిగా చేర్చారు. 15 నెలలుగా విచారణ జరగడం లేదని ఆమె కోర్టుకు వెల్లడించారు. అభియోగ పత్రాల కాపీలను హార్డ్ డిస్క్లో సీబీఐ సమర్పించిందని, అయితే అవి ఓపెన్ కావట్లేదంటూ నిందితులు చెబుతున్నారని పేర్కొన్నారు.
News March 21, 2025
కశ్మీర్లో ఆ రోజులు పోయాయి: అమిత్ షా

కశ్మీర్లో ఉగ్రదాడులు తగ్గిపోయి, పరిస్థితులు మారిపోయాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆ రాష్ట్రంలోని సినిమా హాళ్లన్నీ నిండిపోతున్నాయని చెప్పారు. ‘యువకులు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఉగ్రవాదులకు సానుభూతిగా ఎలాంటి ఆందోళనలు చేయడం లేదు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కశ్మీర్ను నాశనం చేశాయి. మేం కశ్మీర్ను విజయవంతంగా భారత్లో విలీనం చేశాం’ అని పేర్కొన్నారు.
News March 21, 2025
GST: 12% శ్లాబ్రేట్ రద్దుకోసం రంగంలోకి నిర్మల

GSTలో 12% శ్లాబ్రేటు ఎత్తివేతపై ఏర్పాటైన ఆరుగురు సభ్యుల మంత్రుల బృందంతో FM నిర్మలా సీతారామన్ సమావేశం అవుతారని తెలిసింది. పన్ను వ్యవస్థను సింప్లిఫై చేసేందుకు ఈ శ్లాబును రద్దు చేయాలని ప్రయత్నిస్తున్న కేంద్రం GoMను నియమించింది. వీరిలో కొందరు దీనికి మద్దతు ఇస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఏకగ్రీవ నిర్ణయం కోసం నిర్మల వీరితో చర్చించనున్నారు. 12% శ్లాబ్ ద్వారా GOVTకి 5% ఆదాయమే వస్తోంది.